Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుంది అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అయితే కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపు మేరకు చివరికి ఈ సీఎం రేసు నుంచి ఉత్తమ్ రెడ్డి బట్టి విక్రమార్క తప్పుకోవడంతో ఆ అవకాశం రేవంత్ రెడ్డిని వరించింది అని చెప్పాలి. ఇక ఈయన ముఖ్యమంత్రిగా నిన్న ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం కూడా చేశారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా ఎలాంటి పొలిటికల్ నేపథ్యం లేకుండా స్టూడెంట్ లీడర్ గా ఉన్నటువంటి ఈయన అనంతరం జడ్పిటిసి గాను ఎంపీగాను కొనసాగుతూ రాజకీయాలలో అంచలంచలుగా ఎదిగారు. ఇలా రాజకీయాల్లో కొనసాగుతూ నేడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
రేవంత్ రెడ్డి విద్యాభ్యాసం తన కుటుంబం గురించి అలాగే తన భార్య పిల్లల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి అయితే తాజాగా ముఖ్యమంత్రిగా తెలంగాణ బాధ్యతలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి నామినేషన్ సమయంలో అఫీడవిట్లో తన ఆస్తిపాస్తుల వివరాలను తెలియజేశారు.
30 కోట్ల ఆస్తిపాస్తులు..
రేవంత్ రెడ్డి తన ఆస్తి మొత్తం విలువ 30,95,52,652 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు. తన దగ్గర ఐదు లక్షల 34 వేల నగదుతో పాటు ఆయన భార్య గీతారెడ్డి దగ్గర 1235 గ్రాముల బంగారం విలువ 83,36,000 ఉన్నాయట. అలాగే 7,17,800 విలువచేసే వజ్రాల ఆభరణాలు ఉన్నాయట. వెండి 9,700 గ్రాముల వరకు ఉన్నట్టు సమాచారం.రేవంత్ రెడ్డి ఆయన భార్య దగ్గర పేరు మీద ఉన్న అప్పు 1,30,19,901 ఉందని తెలుస్తుంది. ఇక వీరికి ఒక మెర్సిడెజ్ బెంజ్ కార్, హోండా సిటీ ఉన్నాయి.ఇక రేవంత్ రెడ్డి దగ్గర 50,000 ఖరీదు చేసే రైఫిల్. రెండు లక్షల ఖరీదు చేసే పిస్టల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.ఇక ఈ సమాచారం మొత్తం రేవంత్ రెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…