Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ నిందితులుగా పేర్కొన్న వారిలో దస్తగిరి అప్రూవర్ గా మారగా మిగిలిన వారిలో ఎర్ర గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే వీరిలో ఏ6 గా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి తన తండ్రి ప్రకాష్ రెడ్డిని తీసుకువచ్చి వివేకానంద హత్య జరిగాక బ్యాండేజ్ వేయించాడు అనే ఆరోపణల నడుమ అరెస్టు అయ్యాడు. ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి ప్రకాష్ రెడ్డి వైఎస్ భారతి రెడ్డి తండ్రి హాస్పిటల్ లో కాంపౌండర్ గా పనిచేస్తున్నాడు. హత్య తరువాత సాక్ష్యాలు మాయం చేసే దిశగా రక్తాన్ని భాస్కర్ రెడ్డి క్లీన్ చేయించారు అనే ఆరోపణలు ఉండగా తలకు తగిలిన గాయాన్ని బ్యాండేజ్ తో కవర్ చేయడానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రిని తీసుకువచ్చారు అనేది ఆరోపణ. ఇక ఈ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ ఆయన అభిప్రాయాలను తెలిపారు.
ఉదయ్ కుమార్ రెడ్డిని ఎందుకు సిబిఐ టార్గెట్ చేసింది…
గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి యురేనియం ఫ్యాక్టరీలో ఉద్యోగిగా ఉంటున్నారు, ఆయన తండ్రి హాస్పిటల్ లో కాంపౌండర్ గా ఉన్నారు. ఉదయ్ కుమార్ తండ్రిని తీసుకువచ్చి వివేకానంద తలకు బ్యాండేజ్ వేయించాడు. అయితే వివేకానంద మరణించిన రోజు ఉదయ్ కుమార్ ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. కానీ సిబిఐ తో వెళ్లానని అపద్ధం చెప్పారు. అంతేకాకుండా ఫ్యాక్టరీకి రాకుండానే అక్కడ వచ్చినట్లు అటెండెన్స్ ఉంది.
ఇక గూగుల్ టేక్ అవుట్ ద్వారా ఉదయ్ కుమార్ ట్రేస్ చేసినపుడు వివేకానంద హత్య రోజు రాత్రి ముడుగంటల ప్రాంతంలో బయటికి వచ్చినట్లు తెలుస్తోంది అంటూ బాలాజీ సిబిఐ విచారణకు సంబంధిచిన అంశాలను తెలిపారు. అయితే కేసులో మరిన్ని వివరాలను సేకరించడానికే ఉదయ్ కుమార్ బెయిల్ కి అప్లై చేస్తున్న సిబిఐ ఇవ్వకూడదు అంటూ కోర్టులో కోరుతోంది అని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…