Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో పూటకో వార్త బయటికి వస్తున్నా అసలు నిందితులు బయటికి రావడం లేదు. అయితే సిబిఐ కావాలనే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తోందంటూ ఒకవైపు వినిపిస్తున్నా విచారణకు అవినాష్ రెడ్డి హాజరువ్వాల్సిన సమయంలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కి తరలించడం, ఆ కారణంతో సిబిఐ విచారణకు గడువు కోరడంతో అవినాష్ రెడ్డి విచారణ తప్పించుకోడానికి కావాలనే ఇలా చేస్తున్నడంటూ విపక్షాలు విమర్శిస్తుంటే మరోవైపు వైఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి సీరియస్ గా ఉందని వైఎస్ కుటుంబ నుండి విజయమ్మ, వివేకానంద రెడ్డి చెల్లి విమలా రెడ్డి పరామర్శించారు. ఇక అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన హై కోర్ట్ తీర్పును రిజర్వు చేసి పెట్టింది. ఆపైన అవినాష్ రెడ్డికి హై కోర్ట్ బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే వాదనల మధ్యలో సిబిఐ ఒక రహస్య సాక్షి గురించి చెప్పడం, సీల్డ్ కవర్ లో ఆ సాక్షిని ప్రవేశపెడతామని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
రంగంలోకి వైఎస్ ప్రతాప్ రెడ్డి…
అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని కేసులో నిందితులుగా నిరూపించడానికి సునీత రెడ్డి, సిబిఐ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఒక రహస్య సాక్షి ఉన్నాడు అంటూ సిబిఐ కోర్ట్ కి చెప్పడం, సీల్డ్ కవర్ లో సమర్పించడానికి ఒప్పుకోవడంతో అసలు ఆ రహస్యసాక్షి ఎవరు అనే ప్రశ్న మొదలవగా ఆ రహస్య సాక్షి షర్మిల అంటూ మొదట ప్రచారంలో జరిగినా ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది మాత్రం వైఎస్ ప్రతాప్ రెడ్డి పేరు.
వైఎస్ కుటుంబంలో మరో కీలక వ్యక్తి అయిన ప్రతాప్ రెడ్డి గారు స్వయానా అవినాష్ రెడ్డి పెదనాన్న. అయితే ప్రస్తుతం సునీత రెడ్డి వైపు ప్రతాప్ రెడ్డి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాంటూ బాలాజీ తెలిపారు. వివేకానంద రెడ్డికి అవినాష్, భాస్కర్ రెడ్డికి ఉన్న విబేధాలు సాక్ష్యంగా ప్రతాప్ రెడ్డి చెప్పనున్నట్లు ఆ సాక్ష్యం అవినాష్ కి వ్యతిరేకంగా పనిచేస్తుందని కథనాలు వస్తున్నాయని బాలాజీ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…