Analyst Damu Balaji : వివేకానంద హత్య కేసు అనేక మలుపులు తిరిగి మళ్ళీ అవినాష్ రెడ్డి అరెస్టు దగ్గరే ఆగుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానందను హత్య చేయించారని ఈ కేసులో మొదటి నుండి ఆయనను అరెస్టు చేయాలని వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి కోరుకుంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండగా తాజాగా సుప్రీం కోర్ట్ ను సునీత్ రెడ్డి ఆశ్రయించారు. సుప్రీం కోర్ట్ లో తాజగా ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్ మీద జరిగిన వాదనలో జరిగిన పరిణామాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
సునీతకి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్…
వివేకానంద కేసు ఆ కోర్ట్ ఈ కోర్ట్ అనుకుంటూ చివరికి ఇపుడు సుప్రీం కోర్ట్ వద్దకు చేరగా సుప్రీం కోర్ట్ మొదటి నుండి అన్ని ఆధారాలను ఆలగే పోలీసుల ఛార్జ్ షీట్స్ ను సేకరించి విచారించాలని భావిస్తోంది. తాజాగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిపి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది కోర్ట్. ఏ1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కి బెయిల్ ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది.
ఇది సునీతకు ఊరట కలిగించే అంశం అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. అప్రూవర్ గా మారమని ఎర్ర గంగిరెడ్డిని సునీత సిబిఐ ద్వారా ఒత్తిడి చేసినా అది కుదరలేదు అందుకే బెయిల్ మీద బయటికి రాకూడదని సునీత గట్టిగా ప్రయత్నించింది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక అవినాష్ రెడ్డి కి సెప్టెంబర్ 11 వరకు ముందస్తు బెయిల్ ఉండటం వల్ల ఆయనకు ఊరట కలిగించే అంశమే ఆయన ముందస్తు బెయిల్ ను రద్దు చేసి రిమాండ్ కు తీసుకోవాలని సునీత పిటిషన్ వేసినా సుప్రీం ఒప్పుకోలేదు. అయితే సిబిఐ కోర్ట్ మాత్రం అవినాష్ రెడ్డి ని కోర్ట్ కి హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది అంటూ బాలాజీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…