Featured

Analyst Damu Balaji : హయత్ నగర్ రాజేష్ హత్యలో ఆ టీచర్ కుటుంబమే అంతా చేసిందా?? అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : నేటి సమాజంలో నేరాలు జరగడానికి ప్రధాన కారణం డబ్బు లేకపోతే వివహేతర సంబంధాలు. ఎక్కువగా వెలుగు చూస్తున్న క్రైమ్స్ వీటి వల్లే జరుగుతున్నాయి. భార్యభర్తల మధ్య మరో వ్యక్తి ఉండటమే చాలా కుటుంబాలలో కలహాలకు కారణమవుతోంది. అడ్వాన్స్ టెక్నాలజి అందుబాటులో ఉండటం వల్ల ఇల్లీగల్ అఫైర్స్ రహస్యంగా పెట్టడం సాధ్యపడదు. అందుకే మోసపోయిన వారు చావడమో లేక వారి పార్టనర్ ని చంపడమో చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హయత్ నగర్ రాజేష్ హత్య కేసులో కూడా అలాంటి పరిస్థితులే వెలుగులోకి వచ్చాయి.

వివాహేతర సంబంధమే కారణమా…

ములుగు జిల్లా పంచాక్తులపల్లికి చెందిన రాజేష్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇక హయత్ నగర్ లో ప్రభుత్వ టీచర్ గా ఉన్న సుజాత అనే మహిళతో రాంగ్ డయల్ ద్వారా పరిచయమాయ్యాడు రాజేష్. మొదట్లో ఇద్దరి మధ్య మెసేజెస్ నడిచాయి. రాజేష్ ఆమె పెళ్లికాని అమ్మాయి అనుకుని మాట్లాడాడు అలాగే ప్రేమించాడు. కానీ ఆమెకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసాక దూరం పెట్టాడు. అయితే సుజాత తరచూ మాట్లాడకపోతే చనిపోతా అంటూ బెదిరించడం చేసిందని ఆమె అలా అనే సరికి నేనూ చనిపోతా అంటూ రాజేష్ కూడా మెసెజ్ పెట్టడం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

అయితే చివరిసారిగా మే 22న చైతన్యపురిలోని తన స్నేహితుడు సాయి ప్రకాష్ ఉంటున్న హాస్టల్ నుంచి ఓ పెళ్లికి వెళ్తున్నా అని చెప్పి బయటకు వచ్చిన రాజేష్, మే 24 నుంచి ఫోన్‌కాల్స్‌ను లిఫ్ట్‌ చేయలేదు. ఆపైన సుజాత ఇంటి సమీపంలోనే శవమై కనిపించాడు. సుజాత భర్త మాటలు అనుమాస్పదంగా ఉన్నాయంటూ చెప్పారు దాము బాలాజీ. సుజాత భర్త నాగేశ్వరావు మొదట రాజేష్ ఎవరో తెలియదు అని చెప్పడం, మరోసారి రాజేష్ నా భార్యను బెదిరించడం వంటివి చేయడం వల్లే ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. అయితే సుజాత భర్త, కొడుకు కలిసి ఆమెతో పురుగుల మందు తాగించారని ఆపైన రాజేష్ ను కొట్టించి హత్య చేయించి ఉండవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నట్లు బాలాజీ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago