Featured

Analyst KS Prasad : షర్మిల పార్టీ ఎందుకు పెట్టిందంటే… అసలు పార్టీ ఏర్పాటు వెనకున్న రహస్యం అదే… పొంగులేటి వెనుక జగన్…: కేఎస్ ప్రసాద్

Analyst KS Prasad : జగనన్న విడిచిన బాణంగా తెలుగు రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా వైఎస్ జగన్ చెల్లిగా రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నకు అండగా నిలబడిన షర్మిల ప్రస్తుతం తెలంగాణలో కెసిఆర్ నియంత్రత్వ పాలనపై మరోసారి పోరాటం చేస్తానంటూ తెలంగాణలో పార్టీ పెట్టింది. ఇక రాజకీయంగా మరోసారి తానేంటో చూపించడానికి సిద్ధమైన షర్మిల అపుడు అన్న కోసం పోరాడితే ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం కెసిఆర్ తో పోరాడుతా అంటోంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మరోవైపు వేరే ఉంది అంటూ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ అంటున్నారు.

షర్మిల పార్టీ పెట్టింది అందుకే…

జగన్, షర్మిల ఆస్తుల కోసం కోట్లాడారని అందుకే షర్మిల ఏపీ లో లేకుండా తెలంగాణలో పార్టీ పెట్టుకుని ఇక్కడే ఉంటోందని బయటికి వినిపిస్తున్న ప్రచారంలో నిజం లేదని కేఎస్ ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ లో జగన్ షర్మిల కు ఉన్న ఆస్తులు సుమారు 200 నుండి 300 కోట్ల వరకు ఉంటాయి. వాటిని కాపాడుకోవాలంటే అక్కడ వారి ఉనికి ఉండాలి. అందుకే షర్మిల చేత పార్టీ పెట్టించారు. షర్మిల పార్టీ ద్వారా కొన్ని వర్గాలను ప్రభావితం చేసినా అది వారికి ఉపయోగమే.

ఇక వైసీపీ లో మొదటి నుండి ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు వేరే పార్టీలో ఉండవచ్చు కానీ జగన్ చెబితే షర్మిల కోసం పనిచేసి ఒక పది సీట్లు ఇద్దరూ కలిసి గెలుచుకుని జగన్ అక్కడ చక్రం తిప్పేలా చెయగలరు అంటూ వారి వ్యూహాలు అవి అంతే కానీ షర్మిల జగన్ కు వ్యతిరేకంగా ఉంది, కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేస్తుంది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. రాజకీయ పరిజ్ఞానం కొంచం ఉన్నవారికైనా ఈ విషయం అర్థం అవుతుంది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

34 minutes ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

43 minutes ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

47 minutes ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

51 minutes ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

56 minutes ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

1 hour ago