Anasuya: యాంకర్ అనసూయ లైగర్ సినిమా విజయం పట్ల అనసూయ చేసిన పోస్ట్ అందరికీ తెలిసిందే.అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన నటించిన లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో అనసూయ పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది.
అనసూయ కూడా ఇండస్ట్రీలో ఒక సెలబ్రిటీగా కొనసాగుతూ మరొక హీరో సినిమా ఫ్లాప్ అయితే ఇలా ఆనంద పడటం ఏంటి అని విజయ్ దేవరకొండ అభిమానులు ఓ రేంజ్ లో ఈమె పై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే అనసూయను ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇలా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆంటీ ట్రెండింగ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తనని ఎజ్ షేమింగ్ చేసిన వారిపై తాను కేస్ ఫైల్ చేస్తానని చెప్పినప్పటికీ పెద్ద ఎత్తున తనని ట్రోల్ చేశారు.
ఈ క్రమంలోనే అనసూయ అన్నంత పని చేసిందని చెప్పాలి.ఇప్పటికే తనని దారుణంగా ట్రోల్ చేసిన వారిపై ఈమె సైబర్ క్రైమ్ ఫైల్ చేసి ఆ కేసుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక విషయాన్ని అనసూయ తెలియచేస్తూ ఏదైతే అది అయ్యింది కేసు పెట్టాను ప్రాసెస్ జరుగుతుందనీ అసలు విషయం వెల్లడించారు.
ఇన్ని రోజులు మీ భవిష్యత్తు పాడవకూడదన్న ఉద్దేశంతోనే కేసు పెట్టలేదు అయితే చివరికి కేసు పెట్టాల్సిన పరిస్థితిలను కల్పించారు అంటూ ఈమె తాను కేసు పెట్టిన విషయాన్ని వెల్లడించారు. అలాగే తాను ఏ సినిమానీ, ఏ హీరోని కించపరిచే విధంగా పోస్టులు పెట్టలేదనినా అభిప్రాయాన్ని నేను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తే నాపై డైరెక్ట్ అటాక్ చేశారంటూ ఈ సందర్భంగా అనసూయ క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా అనసూయ కేసు పెడతానంటూ అన్నంత పని చేయడంతో ప్రస్తుతం ఈ విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…