Anasuya: యాంకర్ అనసూయ లైగర్ సినిమా విజయం పట్ల అనసూయ చేసిన పోస్ట్ అందరికీ తెలిసిందే.అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన నటించిన లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో అనసూయ పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది.
అనసూయ కూడా ఇండస్ట్రీలో ఒక సెలబ్రిటీగా కొనసాగుతూ మరొక హీరో సినిమా ఫ్లాప్ అయితే ఇలా ఆనంద పడటం ఏంటి అని విజయ్ దేవరకొండ అభిమానులు ఓ రేంజ్ లో ఈమె పై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే అనసూయను ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇలా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆంటీ ట్రెండింగ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తనని ఎజ్ షేమింగ్ చేసిన వారిపై తాను కేస్ ఫైల్ చేస్తానని చెప్పినప్పటికీ పెద్ద ఎత్తున తనని ట్రోల్ చేశారు.
ఈ క్రమంలోనే అనసూయ అన్నంత పని చేసిందని చెప్పాలి.ఇప్పటికే తనని దారుణంగా ట్రోల్ చేసిన వారిపై ఈమె సైబర్ క్రైమ్ ఫైల్ చేసి ఆ కేసుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక విషయాన్ని అనసూయ తెలియచేస్తూ ఏదైతే అది అయ్యింది కేసు పెట్టాను ప్రాసెస్ జరుగుతుందనీ అసలు విషయం వెల్లడించారు.
ఇన్ని రోజులు మీ భవిష్యత్తు పాడవకూడదన్న ఉద్దేశంతోనే కేసు పెట్టలేదు అయితే చివరికి కేసు పెట్టాల్సిన పరిస్థితిలను కల్పించారు అంటూ ఈమె తాను కేసు పెట్టిన విషయాన్ని వెల్లడించారు. అలాగే తాను ఏ సినిమానీ, ఏ హీరోని కించపరిచే విధంగా పోస్టులు పెట్టలేదనినా అభిప్రాయాన్ని నేను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తే నాపై డైరెక్ట్ అటాక్ చేశారంటూ ఈ సందర్భంగా అనసూయ క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా అనసూయ కేసు పెడతానంటూ అన్నంత పని చేయడంతో ప్రస్తుతం ఈ విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…