Anasuya: యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు.ఇలా బుల్లితెరకు దూరంగా ఉన్నటువంటి అనసూయ వెండితెరపై మాత్రం వరుస అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతో ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అయితే గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విజయ్ దేవరకొండ అభిమానులతో ఫైట్ చేస్తున్నారు. అందుకు గల కారణం విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ అనసూయ కామెంట్లు చేయడమేనని చెప్పాలి. గతంలో కూడా అనసూయ విజయ్ దేవరకొండ సినిమా పట్ల చేసినటువంటి కామెంట్స్ కారణంగా భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా పోస్టర్ గురించి అనసూయ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.ఇలా అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ విజయ్ దేవరకొండ అభిమానులకు కోపం తెప్పించాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఇలా విజయ్ దేవరకొండ అభిమానులను గెలికిన అనసూయ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి జిమ్ లోభారీగా వర్కౌట్ చేస్తూ తెగ కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలు షేర్ చేయడానికిరెండు రోజుల ముందు విజయ్ దేవరకొండ గురించి కాంట్రవర్సీట్వీట్ చేసిన ఈమె ఇప్పుడు ఈ ఫోటోలను షేర్ చేయడంతో కేవలం అటెన్షన్ కోసమే అనసూయ ఇలా చేస్తున్నారంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…