Anchor Anasuya: పైత్యం అంటూ మరోసారి విజయ్ అభిమానులను గెలికిన అనసూయ… ఫైర్ అవుతున్న విజయ్ ఫ్యాన్స్!

Anchor Anasuya: సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా కొన్నిసార్లు అనసూయ చేసే కామెంట్స్ సంచలనాలకు కారణమవుతుంటాయి.

అయితే గతంలో ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసినటువంటి ట్వీట్ ఎలాంటి వివాదాలకు కారణమైందో మనకు తెలిసిందే. విజయ్ ఫ్యాన్స్ ఈమెను భారీ స్థాయిలో ట్రోల్ చేయగా ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించింది. అయితే ఈ వివాదం ముగిసింది అనే లోపే తాజాగా మరోసారి ఈమె విజయ్ దేవరకొండ అభిమానులను గెలికారు.

అనసూయ చేసిన పోస్ట్ చూసినటువంటి విజయ్ అభిమానులు తీవ్రస్థాయిలో అనసూయ పై ఫైర్ అవుతున్నారు ఇంతకీ అనసూయ ఏమని పోస్ట్ చేశారు అనే విషయాన్ని వస్తే…ఇప్పుడే ఒకటి చూశాను. ‘The’ naa?? బాబోయ్!!! పైత్యం.. ఏంచేస్తాం. అంటకుండ చూసుకుందాం.’ అంటూ ట్వీట్ చేసింది. అనసూయ ఈ ట్వీట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించే చేశారు అంటూ మండిపడుతున్నారు.

Anchor Anasuya పోస్టర్ ను టార్గెట్ చేసిన అనసూయ..

తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్నటువంటి ఖుషి సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ పై The Vijay Deverakonda’ అని ఉండటమే కారణమని తెలుస్తుంది. ఇలా పోస్టర్ పై ది విజయ్ దేవరకొండ అని ఉండడంతో అనసూయ ఇలా వ్యంగంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి పోస్ట్ చేశారు అంటూ అభిమానులు తనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి ఈ ట్వీట్ ఎన్ని పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.