Kriti Shetty: అక్కినేని నాగచైతన్య కృతి శెట్టి జంటగా తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానుంది.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య అలాగే చిత్ర బృందం చెన్నైలోని మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటి కృతి శెట్టి నాగచైతన్య గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కృతి శెట్టి మాట్లాడుతూ… తమిళంలో నాకు ఇది రెండవ సినిమా అని తెలియజేశారు. ఇక నాగచైతన్యత కూడా తనకు ఇది రెండవ సినిమా అని తెలిపారు.
నాగచైతన్యతో ఇదివరకే తాను బంగార్రాజు సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్యతో కలిసి కృతి శెట్టి కస్టడీ సినిమాలో నటించారు. అయితే నాగచైతన్యతో నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని,తనతో నటించడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుందంటూ ఈ సందర్భంగా కృతి శెట్టి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గతంలో థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాగచైతన్యకు ఆ సినిమా తీవ్ర నిరాశను పరిచింది. అయితే కస్టడీ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇందులో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అందుకుంటుందని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా సక్సెస్ నాగచైతన్యకు ఎంత అవసరమో నటి కృతి శెట్టికి సైతం అంతే అవసరమని చెప్పాలి.ఈమె నటించిన గత మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి ఈ సినిమా సక్సెస్ అయితేనే తన కెరియర్ ముందుకు సాగుతుందని చెప్పాలి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…