Anchor Anasuya: సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా కొన్నిసార్లు అనసూయ చేసే కామెంట్స్ సంచలనాలకు కారణమవుతుంటాయి.
అయితే గతంలో ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసినటువంటి ట్వీట్ ఎలాంటి వివాదాలకు కారణమైందో మనకు తెలిసిందే. విజయ్ ఫ్యాన్స్ ఈమెను భారీ స్థాయిలో ట్రోల్ చేయగా ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించింది. అయితే ఈ వివాదం ముగిసింది అనే లోపే తాజాగా మరోసారి ఈమె విజయ్ దేవరకొండ అభిమానులను గెలికారు.
అనసూయ చేసిన పోస్ట్ చూసినటువంటి విజయ్ అభిమానులు తీవ్రస్థాయిలో అనసూయ పై ఫైర్ అవుతున్నారు ఇంతకీ అనసూయ ఏమని పోస్ట్ చేశారు అనే విషయాన్ని వస్తే…ఇప్పుడే ఒకటి చూశాను. ‘The’ naa?? బాబోయ్!!! పైత్యం.. ఏంచేస్తాం. అంటకుండ చూసుకుందాం.’ అంటూ ట్వీట్ చేసింది. అనసూయ ఈ ట్వీట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించే చేశారు అంటూ మండిపడుతున్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్నటువంటి ఖుషి సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ పై The Vijay Deverakonda’ అని ఉండటమే కారణమని తెలుస్తుంది. ఇలా పోస్టర్ పై ది విజయ్ దేవరకొండ అని ఉండడంతో అనసూయ ఇలా వ్యంగంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి పోస్ట్ చేశారు అంటూ అభిమానులు తనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి ఈ ట్వీట్ ఎన్ని పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…