Anchor Anasuya:తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన ఈమె వెండితెరపై అవకాశాలను అందుకోవడంతో వరుస సినిమాలతో ఎంతో బిజీగా అయ్యారు. ఇలా వరుస సినిమాలతో బిజీ కావడం వల్ల ఈమె బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.
ఈ విధంగా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసే కొన్ని పోస్టులకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది.అయినప్పటికీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ తన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఎయిర్ పోర్ట్ లో తనకు జరిగినటువంటి చేదు సంఘటన గురించి తెలియజేస్తూ ఎయిర్ లైన్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లినటువంటి అనసూయ తిరిగి హైదరాబాద్ రావడం కోసం ఆలియన్స్ ఎయిర్ లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫ్లైట్ 6:55 కి టేక్ ఆఫ్ కావాల్సి ఉండగా అరగంట పాటు ఆలస్యంగా వచ్చిందని తెలిపారు.
ఇలా ఫ్లైట్ ఆలస్యం కావడంతో అందరం కూడా వెయిట్ చేశామని అయితే ఫ్లైట్ టైం అవ్వడంతో లోపలికి వెళ్తుండగా మాస్క్ లేదని సెక్యూరిటీ తనని అక్కడే నిలబెట్టారని, తిరిగి మాస్క్ ధరించే వరకు తనని అలో చేయలేదంటూ తెలియజేశారు.అదేవిధంగా తన కుటుంబానికి మొత్తం ఒకే చోట ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయగా ఒక్కొక్కరిని ఒక్కోచోట కూర్చోబెట్టారంటూ ఈమె మండిపడ్డారు.
ఇక ఫ్లైట్లో కనీసం సీట్లు కూడా సరిగ్గా లేవని, అలా సీట్లు సరిగా లేని కారణంగా తన షర్టు కూడా చినిగిపోయింది అంటూ ఈ సందర్భంగా ఆలియన్స్ ఎయిర్ లైన్స్ సంస్థ గురించి,తనకు జరిగిన చేదు సంఘటన గురించి ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…