Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..?
Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మి గత కొద్దిరోజులుగా భారీగా నేటిజన్ల ట్రోలింగకు గురవుతున్నారు.గత కొద్దిరోజులుగా ఈమె ఇలాంటి పోస్టులు చేసిన నేటిజన్స్ ఈమెను టార్గెట్ చేస్తూ భారీగా ట్రోల్ చేస్తుండడంతో ఈమె కూడా వారికి తనదైన శైలిలో సమాధానం చెబుతున్నారు.
వ్యక్తిగతంగా రష్మి జంతు ప్రేమికురాలు అనే విషయం మనకు తెలిసిందే. ఇలా మూగజీవాలపై తనకు ఉన్నటువంటి ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. అయితే తాజాగా మరోసారి జంతువులపై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ తాను గత కొంతకాలంగా మిల్క్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడం లేదు అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ కావడంతో కొందరు నేటిజన్స్ గతంలో ఈమె ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ప్రారంభోత్సవానికి వెళ్లినటువంటి ఫోటోలను షేర్ చేశారు.
ఈ ఫోటోలను షేర్ చేసిన నెటిజన్స్ ఈ సెలబ్రిటీలు ఎప్పుడూ ఇంతే డబ్బు కోసం క్షణాలలో మాట మారుస్తుంటారంటూ ఈమె గురించి భారీగా ట్రోల్ చేశారు. అయితే ఈ ఫోటోలపై రష్మి స్పందిస్తూ…అవును గతంలో నాకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను. అయితే గత కొంతకాలంగా తాను పాలను కానీ పాల ఉత్పత్తులను కానీ తీసుకోవడం లేదని ఈమె తెలియజేశారు.
ఇలా పాలు ఉత్పత్తులు తీసుకోకపోవడం వల్ల ఆ ప్రభావం నాపై ఎలా పడిందో నేను తెలుసుకున్నానని, అయితే పాల ఉత్పత్తులను ఫ్యాక్టరీలలో తయారు చేయడం గురించి స్వయంగా తెలుసుకున్న తర్వాత పాల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం పూర్తిగా మానుకున్నాను అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…