ఒకప్పుడు బుల్లితెరపై మోస్ట్ డెసైరబుల్ జంటగా ప్రేక్షకులను అలరించిన రవి, లాస్య ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఒకప్పుడు ఉండేది.. అయితే దాన్ని మా టీవీ ఛానల్ వాళ్ళు ఒక ప్రోగ్రాం ద్వారా చల్లబరిచారు. ఇద్దరినీ కలిపి ఒక మంచి పనిచేశారు. పలు షో లతో వీరిద్దరూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. అంతేకాదు వీరిద్దరి మధ్య పుకార్లు కూడా ఓ రేంజ్ లో వచ్చాయి.. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, ఒకరినొకరు పెళ్లి చేసుకోవడానికి రెడీ గా ఉన్నారని, అప్పటికే పెళ్లి అయినా రవి విడాకులు ఇచ్చి మరీ లాస్య ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారని వార్తలు వచ్చాయి..
అయితే అవి ఎంతో సేపు నిలువలేదు. కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఓ ప్రముఖ డాన్స్ షో నడుస్తుండగానే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి దూరం దూరం గా ఉంటున్నారు. పలు కారణాలతో వారి స్నేహ బంధాన్ని తెంచుకున్నారు.. కారణాలు ఏవైనా దాదాపు ఐదు సంవత్సరాల పాటు వీరిద్దరు కలిసి ఎక్కడా కనిపించలేదు. సంక్రాంతి కి స్టార్ మా లో కలిసి ఒక్కటై వారి అభిమానులను ఖుషి చేసిన కొన్ని రోజుల్లోనే వీరిద్దరూ మళ్ళీ గొడవపడినట్లు తెలుస్తుంది. స్టార్ మాలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం కామెడీ స్టార్స్ అన్న కామెడీ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. వర్షిణి వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఈ షోకు శేఖర్ మాస్టర్, శ్రీదేవి జడ్జిలుగా ఉన్నారు. ఇందులో అవినాష్, అషు రెడ్డి, సుజాత, సిరి తదితరులు పాల్గొంటున్నారు.
ఇక అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా ఇందులో భాగం అవుతుంటారు. ఈ క్రమంలో రానున్న ఎపిసోడ్లో రాజేంద్ర ప్రసాద్ ఈ షోలో సందడి చేయనున్నారు. కాగా ఇక ఈ షోలో రవి, లాస్యలు స్కిట్ చేయబోతున్నారు. ఉప్పెన స్పూఫ్ని వీరిద్దరు చేస్తుండగా.. ఒకరిపై ఒకరు మాటల పంచ్లు వేసుకున్నారు. వీళ్ల నాన్న ఒక్క అబద్దం కూడా ఆడలేదేమోరా అందుకే ఇంత దరిద్రంగా పుట్టింది అని రవి, లాస్యను అనడం.. అర ఎకరం నుంచి నువ్వు, నేనే మాట్లాడుకోవాలి అని లాస్య అనడం ప్రోమోకు హైలెట్గా నిలిచాయి. ఇక వీరిద్దరు పంచే ఎంటర్టైన్ చూడాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…