Movie News

Anchor Shyamala: అర్ధరాత్రి ఫోన్ చేసి టార్చర్ పెట్టేవాళ్ళు .. యాంకర్ శ్యామల కామెంట్స్ వైరల్!

Anchor Shyamala: తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్లుగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శ్యామల ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో సీరియల్ నటిగా పలు సీరియల్స్ చేశారు. అనంతరం యాంకర్ గా స్థిరపడ్డారు. ఇప్పటికీ పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు.

ఇక శ్యామల చివరిగా విరూపాక్ష సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి శ్యామల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె కెరియర్ మొదట్లో తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను తెలియజేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

లవ్ ప్రపోజ్ చేశారు…
తాను తన తల్లితో కలిసి హైదరాబాద్ వచ్చి సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో చాలామంది తనకు ప్రపోజ్ చేశారని, చాలామంది నన్ను విసిగించారని ఈమె తెలిపారు. ఇక నేను నటిస్తున్నటువంటి ఒక సీరియల్ కెమెరామెన్ అర్ధరాత్రి ఫోన్ చేసి విసిగించేవాడు ఒకరోజు అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయగా ఇంట్లో అసలే మగదిక్కు లేరు. నేను ఏమైనా చేయగలను మీ కూతురు కనీసం నాతో మాట్లాడటం కూడా లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారని శ్యామల తెలిపారు. ఆ దెబ్బతో నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ కొంతమంది చెప్పిన ధైర్యమే నన్ను ముందుకు నడిపించిందని శ్యామల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

19 hours ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

19 hours ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

19 hours ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

19 hours ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

20 hours ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

20 hours ago