బుల్లితెరపై పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ వర్షిణి. ఈమె తన అందాలను ఆరోబోస్తూ.. తిరుగులేని హాట్ యాంకర్గా పేరు తెచ్చుకుంది. ఈమె ఈటీవీలో ప్రసారం అవుతున్న రియాల్టీ డ్యాన్స్ షో ఢీ తో బాగా పాపులర్ అయ్యింది. ఈ షోలో రష్మీతో కలిసి వర్షిణి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఈ షోకు మరింత గ్లామర్ డోస్ తీసుకు రావడంలో వర్షిణి బాగా హెల్ఫ్ అయ్యింది. ఈమె ఢీలో హైపర్ ఆదికి జోడీగా వర్షిణి ఎంతో సందడి చేసింది. అయితే ఈ షోలో ఆమె కొన్ని కారణా వల్ల గత కొంత కాలం నుంచి కనిపించలేదు. ఆమె ప్లేస్ లో దీపికా పిల్లిని తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ఢీ షో నుంచి తప్పుకున్న ఆమె మా టీవీలో ప్రసారం అయ్యే ‘కామెడీ స్టార్స్’లో యాంకర్గా కొన్ని రోజులు సందడి చేసింది. ఆ తర్వాత ఈ షో నుంచి కూడా మయామైంది.
చాలామంది బిగ్ బాస్ కోసం.. ఈ షో వదులుకున్నారని అన్నారు. కానీ చివరకు చూస్తే ఆమె బిగ్ బాస్ లో కనిపించలేదు. వర్షిణి బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇక వర్షిణి ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడింది అట. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వర్షిణి బుల్లితెరకు రావాలని ఏనాడు అనుకోలేదని.. అయితే తాను మోడలింగ్ చేసేటప్పుడు అవకాశాలే తన వెంట పడ్డాయని ఆమె చెప్పుకొచ్చాడరు.
ఈ జర్నీలో తాను ఎన్నో అవమానాలకు గురి అయ్యానన్నారు. టాలీవుడ్కు చెందిన ఓ డైరెక్టర్ ఓ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పారని.. అగ్రిమెంట్ పై సంతకం చేయడానికి తనను ఇంటికి రమ్మని కోరాడాని.. తాను అలాగే ఇంటికి వెళ్లానని చెప్పింది. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ డైరెక్టర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాలని.. ఇష్టం వచ్చిన దగ్గర తాకే ప్రయత్నం చేస్తూ.. చేయి పట్టుకొని తనను బెడ్ పై లాగేందుకు ప్రయత్నించాడని.. కానీ తాను అతడి చెంప చెల్లుమనిపించి అక్కడ నుంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు. అయితే ఆ డైరెక్టర్ పేరు మాత్రం ఆమె చెప్పకపోవడం గమనార్హం.
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…