షణ్ముఖ్ జస్వంత్ కు యూట్యూబ్ స్టార్ అనే పేరు ఉంది. అతనికి ఉన్న మిలియన్ల మంది అభిమానులు వాస్తవానికి ఫైనల్కు చేరుకోవడంతో పాటు రేసులో ‘రన్నరప్’గా నిలిచేందుకు సహాయపడింది. అయితే అతను విజేతగా ప్రకటించబడలేదని అతడి అభిమానులు కలత చెందారు.
బిగ్ బాస్ 5 విజేతగా ప్రకటించబడిన తర్వాత సన్నీ అభిమానులపై విరుచుకుపడటం ప్రారంభించారు. షణ్ముఖ్ ఆర్మీ సన్నీని ట్రోల్ చేయడం ప్రారంభించారు. అతను తన భారీ పీఆర్ యాక్టివిటీ , ఇంటి లోపల ‘గ్రూపింగ్’ని ఉపయోగించుకున్న విధానం వల్ల అతను గెలిచాడని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన సన్నీ అభిమానులు కూడా.. షణ్ముఖ్ అభిమానులపై కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు.
హౌస్ లో కేవలం మోజ్ రూంకి పరిమితమైన షణ్ముఖ్ ఫైనల్ వరకు చేరడం ఒక రకంగా అదృష్టమని ట్రోల్ చేస్తున్నారు. హౌస్ అంటే ప్రతీ ఒక్కరితో కలిసిమెలిసి ఉండాలి కానీ.. షణ్ముఖ్ కేవలం సిరితోనే ఉన్నాడు.. సిరి మేనియాలో పడి.. ఇలా అయ్యాడంటూ కామెంట్లు చేస్తున్నారు. 15 వారాల్లో షణ్ముఖ్ ఒక్క గేమ్ కూడా
సరిగ్గా ఆడలేదని.. టైటిల్ గెలిచిన సన్నీపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు.
షణ్ముఖ్ బిగ్ బాస్ వేదికపై తన ప్రసంగంలో సన్నీని అభినందించలేదు.. కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదని వాళ్లు ప్రస్తావించారు. ఇది షణ్ముఖ్ లో వచ్చిన పరిపక్వత అంటూ పరోక్షంగా షణ్ముఖ్ పై విరుచుకుపడ్డారు. షణ్ముఖ్ అభిమానులు కూడా సన్నీ తన స్నేహితులను ఉపయోగించుకుని ఫైనల్ వరకు వచ్చి ఓట్లను గెలుచుకున్నారని ఆరోపించడంలో బిజీ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…