Anitha Chowdary: అనిత చౌదరి అంటే టక్కున ఈమె గుర్తుకు రాకపోయినా కస్తూరి అంటే మాత్రం అందరికీ ఇట్టే గుర్తుకు వస్తుంది. కస్తూరి సీరియల్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి అనిత చౌదరి ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు సినిమాలలో కూడా కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించిన అనిత చౌదరి అనంతరం సినిమాలు సీరియల్స్ లో నటించే అవకాశాన్ని అందుకున్నారు.
మంజుల నాయుడు దర్శకత్వంలో తెరికెక్కిన కస్తూరి సీరియల్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సీరియల్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.కస్తూరి సీరియల్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యేది అయితే ఈ సీరియల్ ఏడు సంవత్సరాలుగా ప్రసారమైందని ఈ సీరియల్ తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందని అనిత చౌదరి తెలిపారు.
ఇక ఈ సీరియల్ సమయంలో ఎంతోమంది అమ్మాయిలు తన పాత్రను ప్రేమించారని అమ్మాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా కస్తూరి పాత్రను ఎంతగానో ఇష్టపడ్డారని తెలిపారు.ఆ సమయంలో సోషల్ మీడియా లేకపోవటం వల్ల ఎంతో మంది అభిమానులు తనకు ఉత్తరాలు రాసేవారని ఈ సందర్భంగా అనిత చౌదరి తెలియజేశారు.
కొంతమంది అబ్బాయిలు ఉత్తరాల ద్వారా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ సీరియల్ రావటం వల్ల తమ భార్యలు తమకు భోజనం పెట్టడం కూడా మానేశారని ఫిర్యాదులు చేసేవారు. అంతలా ఈ పాత్ర తనకు గుర్తింపు వచ్చిందని, ప్రేక్షకుల ఆదరాభిమానాలకు మించిన అవార్డులు ఏవి లేవంటూ ఈమె తెలిపారు. ఇక చత్రపతి సినిమాలో సూరీడు.. ఓ సూరీడు.. ఏడున్నావురా? బస్సుకు ఏలవుతోందనే ఒక డైలాగ్ ద్వారా తన పాత్ర ఎంతో హైలైట్ అయిందని ఈ డైలాగ్ ఎంతోమంది ప్రేక్షకుల గుండెను తాకింది అంటూ ఈ సందర్భంగా ఈమె తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…