టాలీవుడ్ సినీ ఆర్టిస్ట్ సాయిసుధ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడు కేసు రోజురోజుకు ముదురుతున్నట్టుగానే ఉంది. తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ సినీ కెమెరామెన్ ఛోటా.కె. నాయుడు తమ్ముడు, శ్యామ్.కె.నాయుడు తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సినీ ఆర్టిస్ట్ సాయి సుధ S.R నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు శ్యామ్ కే నాయుడు ను అరెస్ట్ చేసి , రిమాండ్ కి తరలించిన తర్వాత తనపై కంప్లైంట్ ఇచ్చిన బాధితురాలు సాయి సుధ సంతకాన్ని మార్ఫింగ్ చేసి, కాంప్రమైజ్ అయినట్టుగా బెయిల్ పిటిషన్ వేశారు శ్యామ్ కె. నాయుడు.
ఆ పిటిషన్ ను పరిశీలించిన నాంపల్లి కోర్ట్ శ్యామ్ కే నాయుడు కు బెయిల్ మంజూరు చేసింది. దాంతో రిమాండ్ కి వెళ్లిన 2 రోజుల్లోనే బెయిల్ పై బయటికొచ్చారు శ్యామ్ కే నాయుడు. విషయం తెలుసుకున్న సాయి సుధా బెయిల్ పిటిషన్ సవాల్ చేస్తూ తన సంతకాన్నే ఫోర్జరీ చేసి దొంగ సంతకం పెట్టి, బెయిల్ కు తాను ఒప్పుకున్నట్లు పత్రాన్ని సృష్టియించారంటూ మరోసారి కోర్ట్ ను ఆశ్రయించింది. దీంతో శ్యామ్ కె. నాయుడు కధ అడ్డం తిరిగింది. కేసును విచారణ చేసిన నాంపల్లి కోర్టు బెయిల్ ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…