ANR Birth Anniversary: భారతీయ చిత్ర పరిశ్రమలో నటుడు అక్కినేని నాగేశ్వరరావు సినీ ప్రస్థానం గురించి పరిచయం అవసరం లేదు ఎన్నో విభిన్నమైన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన సుమారు 78 సంవత్సరాల పాటు సినీ పరిశ్రమలో కొనసాగి చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు. ఇలా నాగేశ్వరరావు చివరి క్షణం వరకు సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
1941 ధర్మపత్ని అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగేశ్వరరావు చివరిగా మనం సినిమా వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎన్నో అవార్డులు, బిరుదులు సొంతం చేసుకున్నారు.ఇక నేడు నాగేశ్వరరావు జయంతి కావడంతో ఆయన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
ధర్మపత్ని అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగేశ్వరరావు ఎన్నో ప్రేమకథా చిత్రాలను కుటుంబ కథ చిత్రాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన నటనకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనని ఎన్నో బిరుదులతో అవార్డులతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ఏఎన్నార్ అందుకున్నారు.
కేవలం ఈ అవార్డు మాత్రమే కాకుండా వరుసగా పద్మ అవార్డులను కూడా అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మ విభూషణ్’ వంటి మూడు పద్మ పురస్కారాలు పొందిన తొలి నటుడుగా ఈయన పేరు సంపాదించుకున్నారు. అనంతరం ఇలా మూడు పద్మ అవార్డులను పొందిన ఘనత అమితాబచ్చన్ దివంగత బాలు సుబ్రహ్మణ్యం గారికి కూడా చెల్లిందని చెప్పాలి. భారతదేశంలోనే తొలి సారిగా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న నటుడిగా ఏఎన్నార్ రికార్డు సృష్టించారు. ఈ ఘనత కేవలం ఈయనకు మాత్రమే సొంతమైందని చెప్పాలి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…