AP Election Result: రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా జూన్ నాల్గవ తేదీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మే 13వ తేదీ ఏపీ ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఇక కూటమి అధికారంలోకి రాబోతుందని కూటమి నేతలు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీనే తిరిగి అధికారంలోకి రాబోతుందని వైసిపి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేయడమే కాకుండా కోట్లలో బెట్టింగులు కూడా కడుతున్నారు.
మరోవైపు జూన్ 9వ తేదీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరగబోతున్నాయని ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారని కూడా చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు తామే అధికారంలోకి రాబోతున్నారని చాలా బలంగా నమ్ముతున్నారు.
అధికారం ఎవరిదీ…
ఇకపోతే ఈసారి జరిగిన పోలింగ్ సరళి చూస్తే అంచనాలు వేయడం కూడా కాస్త కష్ట తరమే అని చెప్పాలి. పోలింగ్ భారీ స్థాయిలో పెరగడం దేనికి సంకేతం అన్న విషయంపై అందరూ అయోమయంలో ఉన్నారు. అయితే నేడు సాయంత్రం పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఈ ఫలితాలపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్ కి కాస్త అటు ఇటుగా ఫలితాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…