AP Exit Polls 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్ లో భాగంగా ఆరా మస్తాన్ సర్వే కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తాయి అయితే ఎక్కువ శాతం సర్వేలు కూటమి రాబోతుందని చెప్పగా మరికొన్ని సర్వేలు వైసీపీకి అధికారంలోకి రాబోతుందని తెలిపారు.
ఆరా మస్తాన్ సర్వేలో భాగంగా వైసిపికి 94 నుంచి 104 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు ఓడిపోతున్నారని కూడా ఈయన వెల్లడించారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉదయ్, నాదెండ్ల మనోహర్ వంటి వారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు.
ఇలా ఆరా మస్తాన్ ఒక న్యూస్ ఛానల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఏఏ నాయకులు ఓడిపోబోతున్నారు ఎవరు టఫ్ ఫైట్ ఎదుర్కోబోతున్నారు అనే విషయాలను గురించి క్లియర్ గా చెప్పారు. ఇక ఈ డిబేట్ లో భాగంగా యాంకర్ ఆరా మస్తాన్ ను ప్రశ్నిస్తూ ఒకవేళ మీ ప్రిడిక్షన్ తప్పయితే అనే ప్రశ్నను వేశారు.
10 సీట్లు ఎక్కువే వస్తాయి..
ఈ ప్రశ్నకు ఆరా మస్తాన్ సమాధానం చెబుతూ ఏపీ ఎన్నికల ఫలితాలలో నేను చెప్పిన సర్వే కంటే వైసీపీకి పది సీట్లు అధికంగానే వస్తాయి తప్ప తగ్గేదే లేదని తెలిపారు. అలా కాకుండా నేను చెప్పిన సర్వే తప్పని తేలితే ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఉండరు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…