ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మందుబాబులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పోలింగ్ తేదీకి 44 గంటల ముందు మద్యం విక్రయాలను నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి నెల 9,13,17,21 తేదీలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గ్రామస్థాయిలో జరగనున్న ఎన్నికలు కావడంతో భారీగా ఎన్నికలకు సిబ్బంది అవసరమవుతోంది. ప్రభుత్వం ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలు జరిగే సమయంలో సెలవులను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్షన్ ఏజెంట్లుగా వ్యవహరించకూడదని ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికలు జరిగే తేదీలలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు దుకాణాలు, పాఠశాలలకు కూడా సెలవు దినాలుగా ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు ఎన్నికల కొరకు పోలింగ్ కేంద్రాలుగా మారనున్నాయి.
ఎన్నికల ఫలితాలను బట్టే జగన్ సర్కార్ పాలన గురించి ప్రజల అభిప్రాయం తెలిసే అవకాశం ఉండటంతో ఈ ఫలితాల గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటగా ఏడాదిన్నర పాలనలో వైసీపీపై ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఉందో ఈ ఎన్నికల ద్వారా తేలనుంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
వివిధ జిల్లాల కలెక్టర్ల ద్వారా ఆయన ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోనున్నారు. సరైన సమయంలో ఎన్నికల నిర్వహణ జరగడం రాజ్యాంగ హక్కు అని ఆయన పేర్కొన్నారు. బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడటం తగదని ఆయన అన్నారు.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…