నెల్లూరు జిల్లా, కృష్ణ పట్నంకి చెందిన ఆనందయ్య ఆయుర్వేద ఔషదానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఆయన ఇస్తున్న మందులలో కంట్లో వేసే మందుకు మాత్రం అనుమతి నిరాకరించింది. కంట్లో వేసే డ్రాప్స్ కు తప్ప మిగిలిన అన్ని మందులకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. జాతీయ ఆయుర్వేద సంస్థ (CCRAS) ఇచ్చిన నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కంట్లో వేసే మందుపై ఇంకా నివేదిక రావాల్సి ఉందని, నివేదిక వచ్చిన వెంటనే ఆ మందుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఇక ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎటువంటి హాని లేదని CCRAS నివేదిక తేల్చడంతో… తాజగా ప్రభుత్వం వాటికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ఆనందయ్య ఇచ్చే మందును తీసుకోవడానికి కొవిడ్ పాజిటివ్ రోగులు రాకుండా.. రోగులకు బంధువులు గానీ కుటుంబ సభ్యులు గానీ వచ్చి మందును తీసుకువెళ్లాలని ఇందువల్ల కొవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుందని చెప్పిన ప్రభుత్వం.. మందు పంపిణీలో కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…