జగన్ సర్కార్ కొన్ని రోజుల క్రితం రోడ్ సేఫ్టీ నిబంధనలు కఠినంగా అమలు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇకపై వాహనదారుల దగ్గర వాహనానికి సంబంధించిన పత్రాలు లేకపోతే రవాణాశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తారు. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల మోదీ సర్కార్ డిసెంబర్ నెల వరకు పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ ల గడువు తీరినా చెల్లుబాటయ్యేలా ఆదేశాలు జారీ చేసింది.
డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు జనవరి 1వ తేదీ నుంచి నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయం వల్ల ఇకపై చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరంగా జరగనున్నాయి. ప్రభుత్వం 2019 సంవత్సరంలో వాహనదారులకు షాక్ ఇచ్చేలా మోటారు వాహన చట్టాన్ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం నిబంధనలకు అనుగుణంగా జరిమానాలను భారీగా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, బండికి సంబంధించిన పత్రాలలో ఏది లేకపోయినా భారీగా జరిమానాలను చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారులు పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ పై అనర్హత వేటు వేయడంతో పాటు జైలు శిక్షలు విధించే అవకాశాలు ఉంటాయి.
కొత్త ఏడాదిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. పన్నులు చెల్లించకుండా వాహనం నడిపినా, పర్మిట్లు లేకపోయినా రెట్టింపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రవాణాశాఖ సుప్రీం కోర్ట్ రోడ్ సేఫ్టీ కమిటీకి జనవరి 1 నుంచి నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…