Deputy CM Pawan Kalyan's sensational comments!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కాం కేసులో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఈ కేసులో వైసీపీ అధినేత జగన్పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు, ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
లిక్కర్ స్కాం కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ, ఈ కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చట్టబద్ధంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేసిన ఆయన, ఇందులో ఎంతటివారైనా వదిలేది లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం కక్షసాధింపుతో వ్యవహరించడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, లిక్కర్ స్కాం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కేసులో మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ పరిణామాలతో ఏపీ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…