Ap Politics: త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఎన్నికల హడావిడి జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి రాజకీయ నాయకులు చేరడంతో రాష్ట్ర రాజకీయlaaలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున టిడిపిలోకి వలసలు వెళుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఇక ఈయన తెలుగుదేశం పార్టీలోకి రావడంతో మైలవరం ఇన్చార్జిగా ఉన్నటువంటి దేవినేని ఉమా పరిస్థితి అయోమయంగా మారిపోయింది. వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి రావడంతో మైలవరం ఇన్చార్జిగా ఉన్నటువంటి దేవినేని ఉమాను పెనమలూరు ఇన్చార్జిగా వ్యవహరిస్తారని అక్కడ ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇక పెనమలూరులో దేవినేని ఉమకు టికెట్ కన్ఫామ్ అనుకున్నటువంటి తరుణంలో దేవినేని కుటుంబం నుంచి మరో అభ్యర్థి పోటీకి సై అన్నారు. దేవినేనికి కుమారుడు వరస అవుతున్నటువంటి దేవినేని చంద్రశేఖర్ పేరు తెరపైకి వచ్చింది. దేవినేని చంద్రశేఖర్ పాదయాత్రలో లోకేష్ కి చాలా సన్నిహితం అయ్యారు. ఇక లోకేష్ కు ఈయనకు మంచి సఖ్యత ఉన్నటువంటి తరుణంలో పెనమలూరు టికెట్ చంద్రశేఖర్ కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
బాబాయ్ కి పోటీగా అబ్బాయి..
ఈ విధంగా పెనమలూరు టికెట్ చంద్రశేఖర్ కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తరుణంలో దేవినేని ఉమా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న అంశంపై ఆందోళన నెలకొంది ఏది ఏమైనా పెనమలూరు టికెట్ విషయంలో బాబాయ్ కి అబ్బాయి గట్టి షాక్ ఇచ్చారని తెలుస్తుంది. మరి దేవినేని ఉమా విషయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…