Ap Politics: త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఎన్నికల హడావిడి జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి రాజకీయ నాయకులు చేరడంతో రాష్ట్ర రాజకీయlaaలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున టిడిపిలోకి వలసలు వెళుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఇక ఈయన తెలుగుదేశం పార్టీలోకి రావడంతో మైలవరం ఇన్చార్జిగా ఉన్నటువంటి దేవినేని ఉమా పరిస్థితి అయోమయంగా మారిపోయింది. వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి రావడంతో మైలవరం ఇన్చార్జిగా ఉన్నటువంటి దేవినేని ఉమాను పెనమలూరు ఇన్చార్జిగా వ్యవహరిస్తారని అక్కడ ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇక పెనమలూరులో దేవినేని ఉమకు టికెట్ కన్ఫామ్ అనుకున్నటువంటి తరుణంలో దేవినేని కుటుంబం నుంచి మరో అభ్యర్థి పోటీకి సై అన్నారు. దేవినేనికి కుమారుడు వరస అవుతున్నటువంటి దేవినేని చంద్రశేఖర్ పేరు తెరపైకి వచ్చింది. దేవినేని చంద్రశేఖర్ పాదయాత్రలో లోకేష్ కి చాలా సన్నిహితం అయ్యారు. ఇక లోకేష్ కు ఈయనకు మంచి సఖ్యత ఉన్నటువంటి తరుణంలో పెనమలూరు టికెట్ చంద్రశేఖర్ కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
బాబాయ్ కి పోటీగా అబ్బాయి..
ఈ విధంగా పెనమలూరు టికెట్ చంద్రశేఖర్ కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తరుణంలో దేవినేని ఉమా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న అంశంపై ఆందోళన నెలకొంది ఏది ఏమైనా పెనమలూరు టికెట్ విషయంలో బాబాయ్ కి అబ్బాయి గట్టి షాక్ ఇచ్చారని తెలుస్తుంది. మరి దేవినేని ఉమా విషయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…