ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు అదిరిపొయే శుభవార్త చెప్పింది. వైఎస్సార్ రైతుభరోసా పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జగన్ సర్కార్ ఈ నెల 29వ తేదీన జమ చేయనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 50 లక్షలకు పైగా రైతులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. జగన్ సర్కార్ ఈ స్కీమ్ కింద రైతుల ఖాతాల్లో 2 వేల రూపాయలు జమ చేయనుంది.
అయితే తాజాగా జగన్ సర్కార్ రైతులకు మరో శుభవార్త చెప్పింది. రైతు భరోసా స్కీమ్ నగదుతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ డబ్బులను సైతం అదే రోజు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట జగన్ సర్కార్ ఈ నెల 27వ తేదీన ఇన్ పుట్ సబ్సిడీ నగదును రైతుల ఖాతాలలో జమ చేయాలని భావించింది. అయితే రెండు రోజుల వ్యవధిలో రెండు స్కీమ్ ల నగదు జమ చేసే కంటే ఒకేరోజు రెండు స్కీమ్ ల నగదు జమ చేస్తే మంచిదని ప్రభుత్వం భావించింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా కొత్త సంవత్సరానికి రెండు రోజుల ముందే రైతుల ఖాతాలలో నగదు జమ కానుంది. రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా జగన్ సర్కార్ స్కీమ్ లను అమలు చేస్తూ ఉండటంపై రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం రైతులకు తీపికబరు చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 7వ విడత నిధులను ఈ నెల 25వ తేదీన జమ చేయనుంది. దేశంలోని 9 కోట్ల మంది రైతుల ఖాతాలలో నగదు జమ కానుందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…