Featured

రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఒకేరోజు రెండు పథకాల డబ్బులు..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు అదిరిపొయే శుభవార్త చెప్పింది. వైఎస్సార్ రైతుభరోసా పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జగన్ సర్కార్ ఈ నెల 29వ తేదీన జమ చేయనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 50 లక్షలకు పైగా రైతులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. జగన్ సర్కార్ ఈ స్కీమ్ కింద రైతుల ఖాతాల్లో 2 వేల రూపాయలు జమ చేయనుంది.

అయితే తాజాగా జగన్ సర్కార్ రైతులకు మరో శుభవార్త చెప్పింది. రైతు భరోసా స్కీమ్ నగదుతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ డబ్బులను సైతం అదే రోజు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట జగన్ సర్కార్ ఈ నెల 27వ తేదీన ఇన్ పుట్ సబ్సిడీ నగదును రైతుల ఖాతాలలో జమ చేయాలని భావించింది. అయితే రెండు రోజుల వ్యవధిలో రెండు స్కీమ్ ల నగదు జమ చేసే కంటే ఒకేరోజు రెండు స్కీమ్ ల నగదు జమ చేస్తే మంచిదని ప్రభుత్వం భావించింది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా కొత్త సంవత్సరానికి రెండు రోజుల ముందే రైతుల ఖాతాలలో నగదు జమ కానుంది. రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా జగన్ సర్కార్ స్కీమ్ లను అమలు చేస్తూ ఉండటంపై రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం రైతులకు తీపికబరు చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 7వ విడత నిధులను ఈ నెల 25వ తేదీన జమ చేయనుంది. దేశంలోని 9 కోట్ల మంది రైతుల ఖాతాలలో నగదు జమ కానుందని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి దొంగల కలకలం..వెంటాడిన రైల్వే పోలీసులు..

అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…

7 minutes ago

విద్యార్థులకు బూట్లకు బదులు చెప్పులా? కర్ణాటక ప్రభుత్వం కొత్త ఆలోచన..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…

20 minutes ago

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago