Featured

మందుబాబులకు చేదువార్త.. ఆ తప్పు చేస్తే భారీ జరిమానా..?

మరో రెండు రోజుల్లో క్రిస్మస్ పండుగ, ఎనిమిది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్నాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల చివరి వారం సాధారణంగా అమ్ముడయ్యే మద్యంతో పోలిస్తే ఎక్కువగా మద్యం అమ్ముడవుతుంది. గతంలో మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్లను పోలీసులు బ్రీత్ అనలైజర్ల సహాయంతో సులభంగా గుర్తించేవాళ్లు. అయితే కరోనా మహమ్మారి విజృంభణ తరువాత పోలీసులు బ్రీత్ అనలైజర్లను వినియోగించడం లేదు.

దీంతో పోలీసులు మందుబాబులను పరీక్షించడం కోసం ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. గీత గీసి ఆ గీతపై నడవాలని సూచించటం, వేళ్లు లెక్క పెట్టమని చెప్పడం, కళ్లు ఎర్రగా మారైతే మద్యం సేవించారని భావించడం, నిటారుగా నిలబడమని చెప్పడం ద్వారా మందుబాబులు మద్యం సేవించారో లేదో పోలీసులు గుర్తిస్తున్నారు. కొంతమంది పోలీసులు ఇతర మార్గాల ద్వారా కూడా మందుబాబులను గుర్తించే పనిలో పడ్డారు.

ఎవరైనా మద్యం సేవించి తాగలేదని చెబితే అలాంటి వాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించి భారీ జరిమానా విధిస్తున్నారు. మందుబాబులు మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. అందువల్ల మందుబాబులు వీలైతే మద్యానికి దూరంగా ఉండటం, మద్యం తాగినా సొంతంగా వాహనాలను నడపకపోవడం చేస్తే మంచిది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. చాలా సందర్భాల్లో మద్యం తాగే వాళ్ల వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్లే పలు రాష్ట్ర ప్రభుత్వాలు మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కూతురి ప్రాణం తీశిన తండ్రి.. భువనగిరిలో దారుణం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…

56 seconds ago

గురువారం పూజతో అదృష్టం మారుతుందా? కాశీలో అరుదైన బృహస్పతి ఆలయం.. గురు దోషాలకు ప్రత్యేక పరిష్కారం!

భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…

6 minutes ago

రూ.10 కోట్ల స్కామ్ ఆరోపణలు.. మంగ్లీపై వివాదం మరింత ముదురు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…

30 minutes ago

‘మహిళ గౌరవమే దేశ గౌరవం’.. బిల్లుల ముందు మోదీ ట్వీట్ వైరల్

పార్లమెంట్‌లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…

38 minutes ago

రోజంతా తేలికగా ఉండాలంటే ఉదయం ఈ హ్యాబిట్స్ తప్పనిసరి! గ్యాస్, బ్లోటింగ్‌ సమస్యకు ఇంట్లోనే సులభ పరిష్కారం!

ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…

1 hour ago

కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 23న ఆధ్యాత్మిక మహోత్సవం!

తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…

2 hours ago