మరో రెండు రోజుల్లో క్రిస్మస్ పండుగ, ఎనిమిది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్నాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల చివరి వారం సాధారణంగా అమ్ముడయ్యే మద్యంతో పోలిస్తే ఎక్కువగా మద్యం అమ్ముడవుతుంది. గతంలో మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్లను పోలీసులు బ్రీత్ అనలైజర్ల సహాయంతో సులభంగా గుర్తించేవాళ్లు. అయితే కరోనా మహమ్మారి విజృంభణ తరువాత పోలీసులు బ్రీత్ అనలైజర్లను వినియోగించడం లేదు.
దీంతో పోలీసులు మందుబాబులను పరీక్షించడం కోసం ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. గీత గీసి ఆ గీతపై నడవాలని సూచించటం, వేళ్లు లెక్క పెట్టమని చెప్పడం, కళ్లు ఎర్రగా మారైతే మద్యం సేవించారని భావించడం, నిటారుగా నిలబడమని చెప్పడం ద్వారా మందుబాబులు మద్యం సేవించారో లేదో పోలీసులు గుర్తిస్తున్నారు. కొంతమంది పోలీసులు ఇతర మార్గాల ద్వారా కూడా మందుబాబులను గుర్తించే పనిలో పడ్డారు.
ఎవరైనా మద్యం సేవించి తాగలేదని చెబితే అలాంటి వాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించి భారీ జరిమానా విధిస్తున్నారు. మందుబాబులు మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. అందువల్ల మందుబాబులు వీలైతే మద్యానికి దూరంగా ఉండటం, మద్యం తాగినా సొంతంగా వాహనాలను నడపకపోవడం చేస్తే మంచిది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. చాలా సందర్భాల్లో మద్యం తాగే వాళ్ల వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్లే పలు రాష్ట్ర ప్రభుత్వాలు మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాయి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…