సాధారణంగా కొంత మంది భోజనం చేసేటప్పుడు చాలా నెమ్మదిగా తింటూ ఉంటారు. మరి కొందరు మాత్రం ఎంతో హడావిడిగా చాలా వేగంగా భోజనం చేయడం మనం చూస్తూనే ఉంటాము. పని ఒత్తిడి, సమయాభావం వల్ల ఇలా వేగంగా భోజనం చేస్తున్నామని చెబుతుంటారు. అయితే ఈ విధంగా వేగంగా ఆహారం తినడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. వేగంగా ఆహారం తినడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
వేగంగా ఆహారం తినటం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందవు. అంతేకాకుండా తొందరగా భోజనం చేసేవారు వారి శరీర బరువు పెరుగుతారని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మనం తీసుకున్న ఆహారం నమలకుండా మింగటం వల్ల ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తడంతో పాటు మలబద్దక సమస్య కూడా ఏర్పడుతుంది. తొందరగా భోజనం చేసేవారిలో షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. దీంతో మధుమేహ సమస్య తలెత్తుతుంది.
సాధారణంగా భోజనం చేయడం కంటే వేగంగా భోజనం చేసేవారు అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటారని నిపుణులు తెలియజేస్తున్నారు.ఈ విధంగా అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగడంతో పాటు ఊబకాయ సమస్యలు కూడా తలెత్తుతాయి. అదేవిధంగా నెమ్మదిగా ఆహారాన్ని నమిలి మింగటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తకుండా, ఆహారంలో ఉన్న పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా చిన్న పిల్లలు తొందరగా భోజనం చేసే అలవాటు ఉంటే వారికి తల్లిదండ్రులు తగినన్ని జాగ్రత్తలు అని చెబుతూ అన్నం నమిలి తినే విధంగా సూచనలు ఇవ్వాలి. ఆహారం నమిలి మింగడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, శరీర బరువును కూడా నియంత్రించుకోవచ్చు.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…