Featured

అతిగా ఆకలి వేస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంలో పడ్డట్టే..?

మనలో కొంతమంది ఎంత తిన్నా కొంత సమయానికే మళ్లీ ఆకలి వేస్తోందని చెబుతూ ఉంటారు. రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడంతో పాటు చిరుతిళ్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఈ విధంగా తినేవాళ్లు తక్కువ సమయంలో బరువు పెరుగుతారని వెల్లడిస్తూ ఉంటారు. అయితే అతి ఆకలితో బాధ పడే వాళ్లకు ఆ సమస్య అధిగమించడానికి సులువైన పరిష్కార మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

యూనివర్శిటీ ఆఫ్ జార్జియా ఒక అధ్యయనం నిర్వహించి ఆహార సమస్యను ఆహారంతోనే పరిష్కరించవచ్చని చెబుతోంది. ఈ అధ్యయనం ద్వారా కొన్ని ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల అతి ఆకలి సమస్యను సులభంగా అధిగమించవచ్చని తేలింది. కనోలా ఆయిల్‌, సాల్మన్, వాల్ నట్స్ ద్వారా అతి ఆకలి సమస్యను అధిగమించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. 18 – 35 మధ్య వయస్సు ఉన్న మహిళలు, పురుషులపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను తెలిపారు.

వారం రోజుల పాటు వాల్‌నట్స్, సాల్మన్, కనోలా ఆయిల్‌ తో ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో తినాలనిపించే కోరిక తగ్గుతుందని.. తమ పరిశోధనల్లో ఎవరైతే ఈ ఆహారం తీసుకున్నారో వారిలో సరైన సమయానికే ఆహారం తీసుకోవడం, ఆకలి వేయడం తగ్గడం తగ్గినట్టు గుర్తించామని.. అయితే ఈ ఆహారాన్ని వైద్యులు, నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే తీసుకోవాలని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

ఎవరైతే బరువు పెరుగుతారో వాళ్లలో తాత్కాలికంగా ఎలాంటి సమస్యలు కనిపించకపోయినా భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. బరువు పెరిగితే తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ముందు నుంచి బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago