Featured

భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంత పెరగొచ్చంటే..?

కరోనా, లాక్ డౌన్ వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజల ఆదాయం లాక్ డౌన్ వల్ల తగ్గింది. లక్షల సంఖ్యలో ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోగా మిగిలిన ఉద్యోగుల వేతనాలు భారీగా తగ్గాయి. ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.

దాదాపు రెండు నెలల పాటు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ను అమలు చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. దీంతో మోదీ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా చేకూరే ఆదాయంతో ఆర్థిక వ్యవస్థను గాడొన పెట్టాలని భావిస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్ లపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం పెట్రోల్, డీజిల్ 3 నుంచి 6 రూపాయలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పలు ప్యాకేజీలను ప్రకటించింది. ఈ ప్యాకేజీలను సరిగ్గా అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరలను పెంచడమే సరైన మార్గమని అనిపిస్తోంది. దీంతో ఇంధన ధరలను భారీగా పెరగడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది.

కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచితే ప్రస్తుతం కేంద్రానికి వస్తున్న ఆదాయానికి అదనంగా 60,000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయం ఎప్పటినుంచి అమలవుతుందనే విషయం తెలియాల్సి ఉంది. వాస్తవానికి చాలా దేశాలతో పోలిస్తే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు సైతం భారీగా పెరిగే అవకాశం ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago