ట్రూ కాలర్.. ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రతీ ఒక్కరి ఫోన్లలో ఈ యాప్ ఉంటుంది. అపరిచత వ్యక్తులు.. లేదా కొత్త నంబర్ల నుంచి ఏమైనా ఫోన్లు వస్తే.. ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఈ యాప్ను చాలా మంది వాడుతుంటారు. అంతే కాదు ఇటీవల ట్రూకాలర్ కూడా.. పేమెంట్ ఆప్షన్ ను కల్పించింది.
యూపీఐ ద్వారా దీని నుంచి కూడా డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ సరికొత్త రికార్డును నెలకొల్పిందట. అదేంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఈ యూజర్ల సంఖ్య 30 కోట్లకు చేరిందని… అందులో మన భారతీయులే 22 కోట్ల మంది ఉన్నారంటూ.. ఆ సంస్థ ప్రతి నిధులు తెలిపారు. అంటే దాదాపు నలుగలో మూడొంతుల మన భారతీయులే ఉన్నారు.
ఈ ఏడాది యూజర్ల సంఖ్య 25 కోట్లు దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ యాప్ సేవలు దాదాపు 11 ఏళ్ల కిందటే ప్రారంభమయ్యాయి. మొదట ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. తర్వాత దీనిపై ఎక్కువగా నమ్మకం కలగడంతో.. వాడటం మొదలు పెట్టారు. ఇప్పటికి ఈ స్థితికి చేరుకున్నారు.
ఈ ట్రూకాలర్ యాప్ అనేది కేవలం కాలర్ ఐడెంటిటీ మాత్రమే తెలుసుకోవడమే కాదు.. స్పామ్ బ్లాకింగ్, స్మార్ట్ ఎస్సెమ్మెస్, ఇన్ బాక్స్ క్లీనర్, ఫుల్ స్క్రీన్ కాలర్ ఐడీ, గ్రూప్ వాయిస్ కాలింగ్.. ఇలా అనేక కొత్త సదుపాయాలను అందిస్తోంది. ఇంకా మరికొన్ని కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కొత్త యూజర్లు చాలామంది వస్తున్నారని.. ఒక్క ఏడాదిలోనే 5 కోట్ల మంది ఈ యాప్ ను తమ మొబైల్లో ఇన్ స్టాల్ చేసుకున్నారని తెలిపింది.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…