Tammareddy Bharadwaj: మీ ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమా..? ఎవరు ఏం దోచుకుంటున్నారో తేల్చుకుందాం రండి..!
Tammareddy Bharadwaj: గత కొంత కాలంగా సినిమాకు సంబంధించి టికెట్ల వ్యవహారం అనేది వేడెక్కుతోంది. ఒకరిపై ఒకరు దూషించుకుంటూ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. మొన్న సినిమా పరిశ్రమపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఖండించారు.
పెద్ద సినిమా హీరోలు టికెట్లను వేలల్లో అమ్ముకొని దోపిడీ చేస్తున్నారంటూ అతడు ఆరోపించాడు. దానిని అతడు తోసిపుచ్చుతూ.. ఎవరైనా కష్టపడితేనే డబ్బులు వస్తాయని.. దోచుకుంటే దొంగ అవుతాడు.. కానీ దొర కాడు అంటూ చెప్పాడు.
మీ ఎమ్మెల్యేలు ప్రజలను ఎంతో దోచుకుంటున్నారో నిరూపించేందుకు నేను చర్చకు సిద్ధం. మీరు దీనికి సిద్ధమా అంటూ సవాల్ విసిరాడు. ఏపీలో టికెట్ల ధరల తగ్గింపుపై హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తమ్మారెడ్డి మాట్లాడారు.
రాజకీయాల్లోకి వచ్చిన ప్రారంభంలో మీరు ఎలక్షన్ కమిషన్ కు చూపించన ఆస్తలు ఎన్ని.. ఇప్పుడు ఎన్ని అంటూ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ను ఉద్దేశించి ప్రశ్నించాడు. సినిమా వెనుకాల ఎంతో మంది కష్టం ఉంటుందని.. కోట్లు పెట్టుబడి పెట్టి.. పైసా పైసా కూడబెట్టుకుంటారన్నారు. కానీ మీలాగా రూపాయి పెట్టుబడి పెట్టి.. రూ. కోట్లు దోచుకోవడం లేదన్నారు. చీప్ గా దొరికామని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దన్నారు. ఒకరిని విమర్శించే ముందు.. మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. ఇప్పటి వరకు లేని కుల, మత రంగును సినిమా రంగానికి ఆపాదించడం సరికాదన్నారు. కుల ప్రస్తావన లేకుండా ప్రతిభ ఆధారంగా అవకాశాలిచ్చే ఒకే ఒక్క రంగం సినీ రంగమేనని పేర్కొన్నారు. ఇక సినిమా టికెట్ల ధరల నియంత్రణ అనే అధికారం ప్రభుత్వానికి ఉందని.. అయితే ప్రొడక్ట్ కు మాత్రం ధర నిర్ణయించే అధికారం మాకే ఉందన్నారు.అయితే ఆ హక్కును చట్టబద్దంగా సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక అసెంబ్లీని ఎలాగో నాశనం చేశారు.. టీవీలను ఎందుకు నాశనం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…