Manch Family: మంచు ఫ్యామిలీ ఎగిరి గంతేసే వార్త..! వారు అనుకున్న రోజు రానే వచ్చేసింది..!
Manch Family: తెలుగు పరిశ్రమలో ఎక్కువగా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీల మధ్యనే ఎక్కువగా పోటీ ఉంటుంది అని అభిమానులు అభిప్రాయపడుతుంటారు. తన హీరో సినిమా హిట్ అయిందంటే.. లేదు మా హీరో సినిమా హిట్ అయిందంటూ.. వాళ్లకు వాళ్లే కొట్టుకునే పరిస్థితికి వస్తుంది.
కానీ ఇదంత సినిమా వరకే.. నిజ జీవితంలో వాళ్లు కుటంబసభ్యులు బాగానే కలిసి ఉంటారు. ఈ రెండు ఫ్యామిలీలే కాక.. మరో రెండు ఫ్యామిలీలు కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కవగా టాపిక్ అవుతుంటారు. అందులో ముఖ్యంగా.. రాజేశేఖర్ ఫ్యామిలీ అండ్.. మంచు ఫ్యామిలీ.
అప్పుడప్పడు రాజేశేఖర్ ఫ్యామిలీ చిరంజీవికి వ్యతిరేకంగా ఉంటారు అనే వార్తలు వస్తుంటాయి. వాళ్లు పరోక్షకంగా ఒకరపై ఒకరు దూషించుకోవడం చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. ఇక తాజాగా మా అధ్యక్ష ఎన్నికలో మాత్రం.. ఒకరిపై ఒకరు అసహనం ఎంత వరకు ఉందనేది తెలిసిపోయింది.
ఇటు మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంటే.. మంచు ఫ్యామిలీ అంతా మరో వైపు ఉండి పోరాడారు. చివరకు మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు.. మంచు మోహన్ బాబు.. ఇటు విలన్ గా.. అటు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఒక్క సినీ రంగంలోనే కాదు అతడికి ప్రత్యేకంగా విద్యా సంస్థ కూడా ఉందన్న విషయం తెలసిందే. గత కొంతకాలంగా అతడు కుల మతాలకు అతీతంగా.. 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ విద్యను అందిస్తున్నాడు. ఇక ఈ ఫ్యామిలీ చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చింది.. వీళ్లకు సంబంధించిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా వచ్చింది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మోహన్ బాబు. దీనికి సంబంధించి మోహన్ బాబు తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. మీ ప్రేమ, అండదండలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు. ఈ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీగా(ఎంబీయూ(MBU)) ఉంటుందన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…