కేవలం ఒకే ఒక్క సినిమా కొందరి జాతకాలను అమాంతం మార్చేస్తుంది. అది నిజమని నిరూపిస్తూ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అయితే అదే సినిమాలో ఆయన సరసన నటించిన హీరోయిన్ శాలిని పాండే కు మాత్రం ఆశించినంత గుర్తింపు రాలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఆ తరువాత సరైన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమైంది శాలిని పాండే.
తరువాత కళ్యాణ్ రామ్ 118 చిత్రంలో నటించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో పెద్దగా పేరు రాలేదు. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటున్న ఆమె తాజగా అనుష్క నటించిన “నిశ్శబ్దం” సినిమాలో ప్రముఖ పాత్ర పోషితోంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా విడుదలకు నోచులేదు. అయితే తాజాగా ఈ అమ్మడుకి సంబంధించిన ఒక ఫోటో సోషల్ తెగ వైరల్ అవుతుంది. గోవాలో ఒక బాత్ టబ్ లో స్విమ్ సూట్ వేసుకుని రిలాక్స్ అవుతూ మద్యం తాగుతున్నట్టుగా ఉన్న ఆమె ఫోటో ఒకటి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది షాలిని.
ప్రస్తుతం ఈ ఫోటోను నెటిజన్లు భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఫోటోలు పెడతావా? అసలు నీకు బుర్ర పని చేస్తుందా అంటూ శాలిని పండేపై మండిపడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదు.. మరి మున్ముందు ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…