Arjun Sarja : శక్తి ప్రసాద్కి అర్జున్ సర్జా జన్మించాడు. అతని తల్లి లక్ష్మి ఆర్ట్ టీచర్. అతనికి ఒక అన్నయ్య కిషోర్ సర్జా కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అర్జున్ ఎప్పుడూ పోలీసు అధికారి కావాలని కలలు కనేవాడు కానీ అతని విధి అతనిని పూర్తిగా భిన్నమైన దిశలో తీసుకువెళ్లింది.
కన్నడ చిత్రాలలో ప్రముఖ నటుడు అయిన అర్జున్ తండ్రి శక్తి ప్రసాద్, తన కొడుకు నటుడిగా మారడం ఇష్టం లేదు మరియు యుక్తవయసులో అర్జున్ అందుకున్న సినిమా ఆఫర్లను తిరస్కరించాడు. చలన చిత్ర నిర్మాత రాజేంద్ర సింగ్ బాబు శక్తి ప్రసాద్ యొక్క అనుమతి లేకుండా తన ప్రొడక్షన్ హౌస్ కోసం ఒక ఫీచర్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభించడానికి అర్జున్ని ఒప్పించగలిగారు. ఆ తరువాత అతని తండ్రి అర్జున్ సినిమాలోకి వెళ్లడానికి అంగీకరించారు. సింహద మరి సైన్య (1981) చిత్రంలో అతను జూనియర్ ఆర్టిస్ట్గా నటించాడు. మరియు ఆ చిత్ర దర్శకుడు అతని అసలు పేరు అశోక్ బాబు స్థానంలో అర్జున్ అనే స్టేజ్ పేరుని ఇచ్చాడు. అతను కన్నడ చిత్రాలో నటించడం ప్రారంభించారు. అర్జున్ నటుడు-నిర్మాత AVM రాజన్ నుండి ఒక మూవీ ఆఫర్ అందుకున్నాడు. మరియు దర్శకుడు రామ నారాయణన్ తమిళ చిత్రం నంద్రి (1984) చేశారు.
నటుడిగా అతని కెరీర్ 1980ల మధ్యలో ప్రారంభమైంది. అర్జున్ కొన్నిసార్లు ఒక రోజులో అనేక షిఫ్టుల్లో పనిచేసేవాడు. 1990 నాటికి, అతని సినిమాలు బాక్స్ ఆఫీస్ విలువను కోల్పోయాయి మరియు అతను దాదాపు ఒక సంవత్సరం పాటు తమిళం మరియు తెలుగు చిత్రాలలో పని చేయలేదు. అలా కొంతకాలం గడిచాక తిరిగి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 1993లో వచ్చిన “జెంటిల్మెన్” చిత్రం అర్జున్ ని తిరిగి సినీ ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఆ తర్వాత అనేక తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో ఆయన నటించారు. అయితే ఈ మధ్యకాలంలో హీరో అర్జున్ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. తాను మొదటగా నటించిన చిత్రంలోని ఒక సన్నివేశంలో సరిగా నటించకపోవడంతో దర్శకుడు ఏడవమంటే తెలియక నవ్వానని దానికి ఆగ్రహించిన దర్శకుడు చెంపపై కొట్టారని.. మొదట్లో నాకు నటన అంటే ఏమి తెలియదు. దర్శక నిర్మాతలు నా బాడీ చూసి హీరోగా పనికి వస్తారని అనుకున్నారు.
తిరిగి సినిమాలకి దూరంగా వెళ్లి పోదామనుకున్నాను. ఆ తర్వాత తెలుగులో 1985లో కోడి రామకృష్ణ “మా పల్లెలో గోపాలుడు” చిత్రంతో హీరోగా అవకాశం కల్పించారు. ఆ సినిమా అద్భుత విజయం సాధించింది. అలా కొన్ని తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో చేసిన తర్వాత నటనపై అవగాహన పెరిగిందని… ఇప్పటికీ నా పిల్లలు ఐశ్వర్య, అంజన నా మొదటి చిత్రాల్లోని నన్ను, నా నటన చూసి ఎగతాళి చేస్తుంటారు. నేను అందులో బాగోలేనని చెప్తుంటారు. అప్పటి నా సినిమాలను చూడడానికి నేను అంతగా ఇష్టపడనన్నారు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి తనకు వెంకన్నబాబు మేనేజర్ గా ఉండేవారని అలా చిరంజీవితో పరిచయం ఉండేదని ఆ తర్వాత ఆయన, నేను కలిసి శ్రీ మంజునాథ చిత్రంలో నటించాం. ఆ చిత్రంలో నా నటనను అభినందిస్తూ చిరంజీవి ఫోన్ చేసి ఒక రోజు చెప్పారని ఆ ఇంటర్వ్యూలో హీరో అర్జున్ చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న బంగారం కొనుగోళ్లను నియంత్రించడమే లక్ష్యంగా,…
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలపై ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. విడుదలకు ముందు ప్రచార…
దేశంలో ఇంధన వినియోగం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు తరువాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు…
తెలంగాణలోని వరంగల్ సమీపంలో ఉన్న కొమ్మాల గ్రామం ఆధ్యాత్మికతతో పాటు రైతు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రకృతి సోయగాల మధ్య…
ఏలూరు జిల్లా నర్సాపురం రుస్తుంబాధకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన…