Artist Lohith Kumar : తెలుగులో మిమిక్రి ఆర్టిస్ట్ గా అటు సినిమాల్లోను ఇటు బుల్లి తెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి లోహిత్ కుమార్ రెడ్డి. కమెడియన్ వేణు మాధవ్ గారి చొరవతో మిమిక్రి ఆర్టిస్ట్ గా పట్టాభి గారి దగ్గర చేరిన లోహిత్ గారు ఆతరువాత బాపు వంటి పెద్ద డైరెక్టర్ కు అసోసియేట్ గా చేరారు ఇక ఆ తరువాత బాపు గారు తీసిన శ్రీ నాథ కవి సార్వభౌమ కథ సినిమాలో అవకాశం ఇచ్చిన వివిధ కారణాలతో చేయలేదు. ఇక మళ్ళీ ఆయన దర్శకత్వంలోనే బుడుగు సీరియల్ లో హీరోగా చేసారు. ఇక ఆశల పల్లకి అనే సినిమాలో హీరోగా చేసినా లోహిత్ గారు ఆ సినిమాలకు నంది అవార్డులు కూడా వచ్చాయి.
ప్రొడ్యూసర్స్ చాలా మంది డబ్బు ఎగొట్టారు…
ఎంతో మందిని మిమిక్రి ద్వారా అనుకరించే లోహిత్ గారికి కమల్ హాసన్ ను అనుకరించడం చాలా ఇష్టమట. ఇక లోహిత్ గారి పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది వివిధ శబ్దాలను ప్రతి ఐదు సెకండ్లకు మారుస్తూ ఎక్కువ సమయం చేశారట. ఇక సినిమాల్లోను సీరియల్స్లోను ఎక్కువగా మనకు పరిచయం అయినా లోహిత్ గారు చాలా సినిమాల్లో మొదట అవకాశం ఇచ్చి చివర్లో వేరే వాళ్ళను పెట్టుకున్న సందర్బలు ఉన్నాయని చెప్పారు.
అలాగే పని చేయించుకుని రెమ్యూనరేషన్ ఎగొట్టిన చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారంటు చెప్పారు. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇచ్చిన బౌన్స్ అయినా చెక్కులు నా దగ్గర ఇప్పటికి చాలా ఉన్నాయని అవన్నీ చూపిస్తే ఇంకో ప్రోగ్రాం చేయొచ్చు అంటూ లోహిత్ అయన అభిప్రాయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…