Aswini Dutt: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెరికెక్కిన సినిమాలకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అత్యుత్తమమైన నంది అవార్డుల గురించి తరచూ ఏదో ఒక వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటీనటులకు నంది అవార్డులను ప్రకటించేవారు అయితే ఎప్పుడైతే ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిందో అప్పటి నుంచి రెండు ప్రభుత్వాల నుంచినంది అవార్డుల ప్రస్తావన రాలేదు. అయితే తాజాగా నంది అవార్డుల గురించి నిర్మాత అశ్విని దత్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజాగా మీడియా సమావేశంలో భాగంగా దివంగత నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు నిర్మాత అశ్విని దత్ వంటి వారు పాల్గొన్నారు. ప్రేక్షకుల కోరిక మేరకు కృష్ణా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాని మే 31వ తేదీ తిరిగి విడుదల చేస్తున్నామంటూ ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు మీడియా సమావేశంలో తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అశ్వినీ దత్ నంది అవార్డుల గురించి మాట్లాడారు గతంలో సెలబ్రిటీల కష్టాన్ని గుర్తించి అవార్డులు ఇచ్చేవారు ఇలా నంది అవార్డులు తీసుకోవడం సెలబ్రిటీలు కూడా ఎంతో గౌరవంగా భావించారు. అయితే ప్రస్తుతం నంది అవార్డుల ప్రస్తావన మాత్రం లేదని,ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు కదా ప్రస్తుతం ఉత్తమ రౌడీ ఉత్తమ గుండా అవార్డులను ఇస్తున్నారని తెలిపారు.
మరో రెండు మూడు సంవత్సరాలలో ఘనంగా అవార్డులు ఇచ్చే రోజులు వస్తాయని అంతవరకు ఎదురు చూద్దామంటూ ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ అశ్వినీ దత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇలా అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే ఈసారి ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురవుతుందని ఈయన పరోక్షంగా కామెంట్లు చేశారని తెలుస్తోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…