Aswini Dutt: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా గుర్తింపు పొందిన అశ్విని దత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకుపోతున్న అశ్వినీ దత్ తన జీవితంలో కూడా ఎన్నో ఎదురు దెబ్బలు చూశానని చెప్పుకొచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇండస్ట్రీలో నిర్మాతగా ఎదురైన అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఒక సినిమా వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు..ఈ ఇంటర్వ్యూలో అశ్విని దత్ మాట్లాడుతూ ” సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత జయాపజయాలు సర్వసాధారణం. అయితే సక్సెస్ వచ్చినప్పుడు ఎంత ఆనందిస్తామో పరాజయం ఎదురైనప్పుడు కూడా అంతే దృఢంగా ఉండాలని తెలిపాడు. కానీ ఒకానొక సమయంలో తాను నిర్మించిన సినిమా డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవటానికి నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన శక్తి సినిమా. ఆ రోజుల్లోనే శక్తి సినిమాని 40 – 45 కోట్ల బడ్జెట్తో రూపొందించారని, కానీ ఆ సినిమాకి డిజాస్టర్ టాక్ రావటంతో దానివల్ల రూ.32 కోట్ల నష్టపోయానని తెలిపాడు.శక్తి సినిమా వల్ల తన జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలిందని దాంతో సినిమాలు వదిలేసి వెళ్లిపోదాం అనుకున్నానని ఆయన తెలిపారు.
తన కెరీర్లో అది మామూలు విషయం కాదన్నారు. అందుకే నాలుగైదేళ్ల పాటు సినిమాలు తీయాలని అనిపించలేదని ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల అశ్వినీ దత్ నిర్మిస్తున్న అన్ని సినిమాలు మంచి హిట్ అందుకొని ఆయనకి లాభాలు కురిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం వైజయంతి మూవీస్ బ్యానర్పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపిక పదుకొణె నటీనటులుగా ‘ప్రాజెక్ట్-కె’ (వర్కింగ్ టైటిల్) మూవీని నిర్మిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…