Actor Murali Mohan : వ్యాపారం నుండి నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మురళీ మోహన్ గారు జగమే మాయ సినిమాతో పరిచేయమై అనతి కాలంలోనే హీరోగా అనేక చిత్రాల్లో నటించారు. ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన అటు పాలిటిక్స్ లోకి వచ్చి అక్కడా తనదైన ముద్ర వేశారు. ఇక సినిమా నిర్మాణంలో అడుగుపెట్టి జయభేరి బ్యానర్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించిన ఆయన ఈ మద్య కాలంలో సినిమాలను తగ్గించినా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా రంగంలోని అనేక విషయాల గురించి అలాగే ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు.
తెలంగాణ విభజన వల్ల ఆంధ్ర నష్టపోయింది…
చెన్నారెడ్డి లాంటి ఎంతో మంది నేతలు ప్రయత్నించినా రాని తెలంగాణ ఒక బక్క ప్రాణి కెసిఆర్ వల్ల సాధ్యమైంది. కెసిఆర్ పోరాటం చేసినపుడు కూడా చివరి దాకా మాకందరికీ నమ్మకం ఉండేది ఆంధ్ర తెలంగాణ విడిపోవని కానీ తెలంగాణ ఇచ్చేసారు. ఒక్కసారిగా అందరం షాక్ అయ్యాము. కానీ తెలంగాణ ఇవ్వడం వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయింది.
రాజధాని లేకుండా, ఎలాంటి ఇండస్ట్రీ లేకుండా విభజిత రాష్ట్రం అప్పులతో ఏర్పడింది. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ బాగా పరిపాలించారు. ముఖ్యంగా నచ్చింది ఆయన ఇరిగేషన్ పాలసీ. తెలంగాణ మెట్ట ప్రాంతం కావడం వల్ల లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్లే వ్యవసాయం సాధ్యం అందుకే ఆయన మొదట లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కాన్సంట్రేషన్ చేసారు అంటూ చెప్పారు మురళీ మోహన్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…