Sailesh Kolanu: విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ హిట్ ‘ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శైలేష్ కొలను మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు. విదేశాలలో ఉద్యోగం చేసుకుని శైలేష్ సినిమా మీద ఉన్న ఇష్టంతో కథ రాసుకొని దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన శైలేష్ హిట్ పార్ట్ 2 తో మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక హిట్ పార్ట్ 3 ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు శైలేష్ వెల్లడించాడు. ఈ హిట్ పార్ట్ 3 లో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా తాజాగా శైలేష్ శేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అభిమాని కోరిక మేరకు ఇంటికి వెళ్లి అతన్ని సర్ప్రైజ్ చేశాడు. తాజాగా ఈ విషయం గురించి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఈ క్రమంలో అభిమానితో దిగిన ఫోటో షేర్ చేస్తూ..” ఇతని పేరు పవన్. నేను కాకినాడ నుంచి హైదరాబాద్ వెళుతున్నాను అనే విషయం తెలిసి తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కి ఆహ్వానించాడు. అయితే అభిమాని కోరిక మేరకు తాను కూడా సర్ప్రైజ్ ఇస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళానని, వాళ్లది లవ్లీ ఫ్యామిలీ అని శైలేష్ చెప్పుకొచ్చాడు. ఇక పవన్ అమ్మ పునుగులు తినిపించారని అవి చాలా రుచికరంగా ఉన్నాయని తెలిపాడు.
ఆమె హీరో వెంకటేష్ అభిమాని అని తెలిసి మరింత ఆనందపడ్డానని తాను తెరకెక్కిస్తున్న సైంధవ్ సినిమాని మొదటి రోజు మొదటి షో చూస్తానని ఆమె చెప్పటంతో తనకు చాలా ఆనందంగా అనిపించిందని శైలేష్ కొలను చెప్పుకొచ్చాడు. శైలేష్ ప్రస్తుతం హీరో వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తరువాత హిట్ 3 షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అభిమాని కోరికను నెరవేర్చటానికి వారి ఇంటికి వెళ్లిన శైలేష్ పట్ల ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…