Sammakka-Sarakka: మేడారం జాతరలో.. ! బెల్లం బంగారంగా ఎందుకు మారింది..?
Sammakka-Sarakka: గిరిజన కుంభమేళా… మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అంతా సిద్దం అయింది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు కోట్ల మంది ప్రజలు వస్తుంటారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజుల మొదలై నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది.
పెద్ద ఎత్తున నిర్వహించే ఈ జాతరను 1996లో రాష్ట్ర పండగగా ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ ప్రభుత్వ జాతీయపండగగా సమ్మక్క- సారలమ్మ జాతరను గుర్తించాలని డిమాండ్ చేస్తోంది. మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గడ్, ఓడిషా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈసారి కూడా మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.
ఇదిలా ఉంటే పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలతో ఈ మేడారం జాతర సాగుతుంది. అక్కడి నియమ నిబంధనలు కొందరికి కొత్తగా అనిపించ వచ్చు. ముఖ్యంగా బెల్లాన్ని బంగారంగా తల్లులకు సమర్పించడం చాలా మందికి వింతగా తోస్తుంది.
బెల్లాన్ని బంగారంగా తల్లులకు ఎందుకు సమర్పిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మేడారం జాతర మొదలైనప్పుడు కేవలం గిరిజన జాతరగానే ఉండేది. అయితే తరువాత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ప్రారంభించారు. గిరిజనులకు బెల్లం, ఉప్పు వేరే ప్రాంతాల నుంచి వస్తాయి. దీంతో వీటిని గిరిజనులు అపురూపంగా చూసుకుంటారు. కాలక్రమంలో ఈ బెల్లాన్నే సమ్మక్క-సారలమ్మలకు నైవేధ్యంగా సమర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో కథ కూడా ఉంది. సమ్మక్క భర్త అయిన పగిడిద్ద రాజులో పగిడిద్ద అంటే బంగారం అని.. దీంతో బెల్లాన్ని బంగారం అని పిలుస్తున్నారని అంటుంటారు. తమ కోరికలు నెరవేరిన వారు వారి బరువు ఉన్నంతగా బంగారాన్ని కొలిచి తల్లులకు సమర్పిస్తారు. పిల్లలు పుట్టాలని మొక్కుకునేవారు, లేకపోతే కోరిక తీరిన తరువాత బంగారాన్ని అమ్మవార్లకు నైవేధ్యంగా ఇస్తారు. పిల్లలకు జాబ్ వచ్చినా.. లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలు తీరినా.. అనుకున్నట్లు కోరికలు నెరవేరినా.. తల్లులకు మొక్కకున్న విధంగా బెల్లాన్ని వారి ఎత్తు జోకించి నైవేధ్యంగా సమర్పిస్తారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…