Love Effect: ప్రేమ వ్యవహారం.. ? చింత చెట్టుకు వేలాడుతూ యువతి..?
Love Effect: ప్రేమ వ్యవహారం ఓ యువతి మరణానికి కారణమైందా…? అయితే ప్రియుడే హత్య చేశాడా లేకపోతే..? అమ్మాయే ఆత్మహత్యకు పాల్పడిందా.. ? ఇలా ఓ యువతి మరణం పలు ప్రశ్నలకు తావిస్తోంది. శ్రీకాకుళం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సంధిగూడ గ్రామంలోని మండంగి సంధ్య( 25) అనుమానాస్పదంగా మృతిచెందింది.
అసలు ఏం జరిగిందో తెలియదు కానీ.. మంగళవారం రాత్రి సంధిగూడ గ్రామానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న చింతచెట్టుకు ఆమె వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెది హత్యా..? ఆత్మహత్యా..? అని తేల్చేపనిలో ఉన్నారు.
ఈ సంఘటనపై ఎల్విన్ పేట సీఐ టీవీ తిరుపతి రావు, ఎస్సై షన్ముఖ రావు బుధవారం విలేఖరులకు సంధ్య మృతిపై వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా సీతం పేట మండలంల గోహిది గ్రామానికి చెందిన సంధ్యకు గుమ్మలక్ష్మీపురం మండలం వంగర పంచాయతీ సంధిగూడకు చెందిన ఆరిక లక్ష్మణ్ తో పరిచయం ఏర్పడింది.
ఈపరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే సంధ్య నాలుగు సార్లు లక్ష్మణ్ ఇంటికి వచ్చి వెళ్లింది. ఈ ఏడాది జనవరిలో కూడా ఓసారి సంధ్య లక్ష్మణ్ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. సంధ్య, లక్ష్మణ్ కు చెందిన స్టడీ సర్టిఫికేట్లు తీసుకెళ్లింది. అయితే ఇటీవల పలు పోస్టులకు నోటిఫికేషన్లు రావడంతో లక్ష్మణ్ తన సర్టిఫికేట్లు ఇవ్వాలని కోరాడు. అయితే సంధ్య లక్ష్మణ్ కోరికను నిరాకరించింది. ఈ నేపథ్యంలో గోహిది సర్పంచ్ కి లక్ష్మణ్ ఫోన్ చేసి తన సర్టిఫికేట్లు ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు సర్పంచ్.. సంధ్యతో మాట్లాడి సర్టిఫికేట్లు ఇప్పించాడు. ఇదిలా ఉండగా లక్ష్మణ్ జనవరి 28న పనిమీద విశాఖ జిల్లా పెందుర్తి వెళ్లిన సమయంలో సంధ్య మళ్లీ సంధిగూడకు వచ్చింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి సంధిగూడకు 400 మీటర్ల దూరంలోని చింతచెట్టుకు మృతిచెంది వేలాడుతూ కనిపించింది. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. అనంతరం పార్వతీపురం ఏరియాసుపత్రికి తరలించి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. మరణానికి సంబంధించిన కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…