Viral Video: ఇన్ కంట్యాక్స్ అధికారుల దాడులు.. సంపులో కరెన్సీ కట్టలు.. వీడియో వైరల్..!
Viral Video: అక్రమంగా సంపాదించే వారికి ఎవరికైనా భయపడకపోచ్చు కానీ.. ఇన్ కమ్ ట్యాక్స్ రైడింగ్ అంటే మాత్రం ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుంది. పన్నులను ఎగ్గొట్టి.. డబ్బులను అక్రమంగా ఇంట్లోనే దాచుకుంటారు. ఇలా వాళ్లు ఆ డబ్బులను సినిమాల్లో చూపించిన విధంగా.. మనం ఊహించని ప్రదేశంలో దాచుకుంటారు.
తాజాగా ఓ కుటుంబంపై రైడ్ నిర్వహించిన అధికారులు.. ఆ కుటుంబసభ్యులు ఆ డబ్బులను దాచిన ప్రదేశం కనుకున్న అధికారులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామోహ్ జిల్లాలోని వ్యాపారవేత్త శంకర్ రాయ్, అతని కుటుంబంపై దాడులు నిర్వహించారు ఇన్ కంట్యాక్స్ అధికారులు.
వాళ్లు రూ.8కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. ఆ డబ్బులలో కోటి వరకు అండర్ గ్రౌండ్ వాటర్ (సంపు) లో దాచిన బ్యాగులో దొరికింది. ప్రస్తుతం ఆ డబ్బులను ఆరపెడుతున్నట్లు తెలిపారు. వాటిని ఇస్త్రీ కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నగదుతో పాటు సుమారు రూ.5 కోట్ల విలువైన నగలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు మూడు కిలోల బంగారాన్ని కూడా జప్తు చేసినట్లు జాయింట్ కమిషనర్ మున్మున్ శర్మ తెలిపారు. ఈ విషయాన్ని సోదాలకు నేతృత్వం వహించిన జబల్ పూర్ ఐటీ జాయింట్ కమిషనర్ మున్మున్ శర్మ వెల్లడించారు. ఈ దాడి దాదాపు 39 గంటల పాటు కొనసాగింది. మిస్టర్ రాయ్ కుటుంబం ఉద్యోగుల పేరుతో 36 బస్సులను నడుపుతున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ రాయ్ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల గురించి మరింత సమాచారం ఎవరైనా ఇస్తే వారికి రూ. 10 వేలు రివార్డును ఇస్తామని డిపార్ట్మెంట్ ప్రకటించింది . దీనిపై జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ.. రాయ్ కుటుంబానికి సంబంధించి స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తున్నామని తెలిపాడు. ఈ విచారణ తర్వాత మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…