భూమిపై క్రూర జంతువులు ఎలా ఉంటాయో ఆ సముద్రంలో కూడా అదేవిధంగా క్రూర జంతువులు ఉంటాయి. సముద్రంలో సొర చేపలు ఎంతో క్రూరమైనవి. వీటి చేతికి గాని మనం దొరికామంటే ఇక మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఒక్కసారిగా మనుషుల్ని చీల్చి చెండాడే సామర్థ్యం సొర చేపలకు ఉంటుంది. అయితే ఇంతటి భయంకరమైన సొరచేపలు నుంచి ప్రాణాలతో బయటపడటం అంటే అది నిజంగా మన అదృష్టం అని చెప్పవచ్చు. మరి ఇలాంటి అదృష్టం ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తికి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
మాట్ వుడ్ అనే ఒక డ్రోన్ పైలట్ ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ బోండి బీచ్ కి వెళ్లి బాల్కనీలో కూర్చుని డోన్ సముద్రంపై ఎగరేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని కంటికి ఒక ఆశ్చర్యకరమైన ఘటన కనిపించింది. సముద్రంలో ఒక వ్యక్తి సొర చేపకు దొరికి దానితో తీవ్రంగా పోరాడుతున్నట్లు గుర్తించాడు. ఈ క్రమంలోనే మాట్ వుడ్ తన ప్రియురాలితో కలిసి లోకల్ లైఫ్గార్డ్ కి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న లోకల్ లైఫ్ గార్డ్ రంగంలోకి దిగారు. ఈక్రమంలోనే డ్రోన్ కెమెరా ఆధారంగా ఆ వ్యక్తి ఉన్న లొకేషన్ గుర్తించి జెట్ స్కై పై ఒక ఈతగాన్ని సముద్రంలోకి పంపారు. ఈతగాడు ఆ వ్యక్తి దగ్గరకు చేరుకోవడానికి సుమారు 30 నిమిషాలు సమయం పట్టింది. అప్పటికే ఆ వ్యక్తి సొరచేపతో ఎంతో తీవ్రంగా పోరాడుతున్నాడు.
ఈ క్రమంలోనే అతను అక్కడికి చేరుకునేలోపు ఆ వ్యక్తి సొరచేపతో పోరాడి ఒడ్డుకు చేరుకున్నాడు.. ఈక్రమంలోనే లైఫ్ గార్డ్ అతనిని జెట్ స్కై పైకి తీసుకొని సురక్షితంగా బీచ్ కి తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మాట్ వుడ్ రికార్డు చేయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…