నెల్లూర్ జిల్లా, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. బోగిణి ఆనందయ్య ఉచితంగా పంపిణీ చేస్తున్న కరోనా ఆయుర్వేద మందును మొదట బ్రేకులు వేసిన ప్రభుత్వం… ఆ తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందులో ఎటువంటి హానికర పదార్ధాలు లేవని తేలడంతో ఇవాళ నుంచి తిరిగి మందు పంపిణీ ప్రారంభించారు.
అయితే ప్రస్తుతం కరోనా ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేశారు. ఆనందయ్య మందుకోసం ఏపీ, తెలంగాణ తో సహా ఇతర రాష్టాల నుండి జనం భారీగా తరలిరావడంతో పంపిణీ చాలా కష్టతరంగా మారింది. కోవిడ్ నేపధ్యంలో జనాలు భారీగా తరిలి రావడంవల్ల తాత్కాలికంగా కరోనా ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అయితే మందు తిరిగి ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయం త్వరలో తేదీ తో సహా ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరోవైపు రేపటి నుంచి సువిశాలమైన మైదానంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి అధికారాలకు కోరారు.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…