తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ చిత్ర పోకడ పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన టాలీవుడ్ పరిధి దేశం మొత్తం వ్యాప్తి చెందింది.. ఈ ముహూర్తాన ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యిందో అప్పటినుంచి అందరు హీరోలు, అన్ని సినిమాలు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమా చేయాలనీ , దేశం మొత్తం పేరుతో పాటు డబ్బు సంపాదించాలని ఆరాటపడుతున్నారు..
ఇకపోతే బాహుబలి ఈ రేంజ్ లో హిట్ అవడానికి కారణం ఆ సినిమా ని అంతబాగా చెక్కిన జక్కన్ననే.. ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా రాజమౌళి ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు. పాన్ ఇండియా సినిమాకు అసలు సిసలైన అర్థాన్ని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న చూపించారు. అయితే.. ఆ సినిమా 1,2 పార్ట్లతోనే ఆగిపోకూడదని పార్ట్-03 కి కూడా తెరకెక్కించాలని నెట్ ఫ్లిక్స్తో కలిసి జక్కన్న ప్లాన్ చేశారు. అందుకు జక్కన్న ప్రముఖ రైటర్స్తో కలిసి రాజమౌళి కథ రెడీ చేయించారు. దీనికి ‘బిఫోర్ ద బిగినింగ్’ టైటిల్ అనుకున్నారు.
తెలుగు దర్శకులైన.. టాలీవుడ్లో తమ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రవీణ్ సత్తారు, దేవకట్టాలకు ఈ బాధ్యతలను జక్కన్న అప్పగించారు. ఊహించిన దానికంటే భారీగానే షూట్ చేశారు. కానీ ఫైనల్ కట్ చూసుకున్న తర్వాత నెట్ఫ్లిక్స్ యాజమాన్యానికి అస్సలు నచ్చలేదట. ‘అసలేంటిది.. ఇంత చెత్తగానా..? దీన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేయండి.. మీ వల్ల వంద కోట్ల నాశనమయ్యాయ్’ అని నెట్ఫ్లిక్స్ తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటే కుదరదని డైరెక్ట్గా రాజమౌళినే రంగంలోకి దింపాలని నెట్ఫ్లిక్స్ భావిస్తోందట. త్వరలోనే ఆయన్ను సంప్రదించాలని భావిస్తున్నారట. అయితే.. జక్కన్న ఏమంటారో..? గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వ్యవహారంపై అటు నెట్ఫ్లిక్స్ కానీ.. ఇటు ప్రవీణ్ సత్తారు, దేవకట్టాలుగానీ రియాక్ట్ అయితే తప్ప అసలు విషయం తెలిసొచ్చే పరిస్థితులు లేవు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…