Balagam Fame Komuramma : బలగం సినిమా చిన్న సినిమాగా విడుదల అయి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమా కోసం పనిచేసిన ఎంతోమంది టెక్నీషియన్ తో పాటు ఆర్టిస్టులకు మంచి పేరు గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమా విడుదల అయి నెల పైనే కావొస్తున్నా ఇంకా సోషల్ మీడియాలో బలగం గురించిన ముచ్చట్లు ఆర్టిస్టుల ఇంటర్వ్యూలే ఉంటున్నాయి. ఇక బలగం సినిమాలో ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ చాలా మందిని ఏడ్పించింది. చివర్లో మొగిలయ్య, కొమురమ్మలు పడే పాట అందరినీ కదిలించిందనే చెప్పాలి. అలాంటి మనసుకు హత్తుకునే పాటను పాడిన తెలంగాణ కళాకారులైన కొమురమ్మ, మొగిలయ్యలకు ఇపుడు తీరని కష్టం వచ్చింది. వాళ్ళను ఆకాశానికెత్తిన సోషల్ మీడియా వల్లే ఇబ్బందులను ఎదుర్కోంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తప్పుడు కథనాలు ప్రసారం చేయకండి…
మొగిలయ్య సినిమా ద్వారా ప్రపంచానికి తెలిసాడు. అయితే అంతకు ముందే ఆయన తెలంగాణ కళాకారుడు అయితే దురదృష్టవషాత్తూ ఆయనకు కిడ్నీ సమస్య కారణంగా ఖచ్చితంగా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఆర్థిక స్థోమతకు అది తలకు మించిన భారం. అయితే బలగం సినిమా పుణ్యమా అని గుర్తింపు రావడం వల్ల కొంత ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి రాజకీయ ప్రముఖుల నుండి లభించింది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ 5 లక్షల సహాయం, నిర్మాత దిల్ రాజు 3 లక్షల సహాయం చేసాడు, మంత్రి రోజా 3 లక్షల సహాయం చేసింది, డబ్బు బాగానే వాళ్లకు అందుతోందని కట్టు కథలను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారంటూ మొగిలయ్య భార్య కొమురమ్మ తెలిపారు. అలా చేయకండి అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. కేవలం తెలంగాణ ప్రభుత్వం నుండి సహాయం అందుతోందని కొందరు మంత్రులు వచ్చి పరామర్శించి సహాయం చేసారని తెలిపారు. మొగిలయ్యకు ప్రస్తుతం కంటి చూపు కూడా పోవడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…