Analyst Damu Balaji : ఈ మధ్య టీవీనే కాకుండా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లోనూ వివిధ సెలబ్రిటీ షోస్ ఎక్కువయ్యాయి. అన్నిటికంటే బాగా ఫేమస్ అయినది ఆహా ఒరిజినల్స్ లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్. మెయిన్ గా ఈ షో బాలకృష్ణ వల్లే సక్సెస్ అయింది. ఈ షో కూడా ఇదివరకు వచ్చిన సెలబ్రిటీ టాక్ షోనే అయినా బాలకృష్ణ హోస్ట్ గా ఈ షో రన్ అవడమే మెయిన్ హైలైట్. ఇక టాలీవుడ్ యంగ్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు పలువురిని ఈ షోకి పిలిచి బాలయ్య మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఇక ఇలాంటి షో ఆల్రెడీ టీవీలో అయితే ఆలీ తో సరదాగా అంటూ ఆలీ హోస్ట్ గా వస్తోంది కూడా. ఈ షో టీవీ షోలలో మంచి హిట్. ఇక మరోవైపు రాణా దగ్గుబాటి కూడా నెంబర్ వన్ యారీ అంటూ అటు ఇటు గా ఇలాంటి షోనే చేసాడు. ఇక సోనీ లైవ్ ఓటిటి లో కూడా నిజం విత్ స్మిత అంటూ పాప్ సింగర్ స్మిత హోస్ట్ గా ఒక షో రన్ అవుతోంది.
స్మిత షోలో సుప్రియ హాట్ కామెంట్స్…
ఈ షో గురించి దాము బాలాజీ మాట్లాడుతూ నిజం విత్ స్మిత షోకి పెద్దగా రేటింగ్స్ లేవని అన్నింటి కన్నా బెస్ట్ ఎపిసోడ్ అంటే చిరంజీవి గారి ఎపిసోడ్ అంటూ చెప్పారు. ఇక ఈ సీజన్ కి లాస్ట్ ఎపిసోడ్ గా ముగ్గురు పవర్ ఫుల్ మహిళలను ఈ షోలో ఆహ్వానించగా అందులో రాధిక, సుప్రియ, స్వప్న దత్ ఉన్నారంటూ తెలిపారు. అయితే సుప్రియ గారు బయట పెద్దగా ఇంటర్వ్యూ ఇవ్వరు కాబట్టి ఆమె షోలో హైలైట్. ఆమె అగ్ర హీరోలందరి గురించి మాట్లాడుతూ బాలకృష్ణ అంటే తనకు చాలా భయం ఆంటూ చెప్పారు. ఇక రొమాంటిక్ హీరో అంటే తాతయ్యే అని చెప్పిన సుప్రియ తనకు తాతయ్య, మావయ్య ను చూసి మేకప్ వేసుకుని సెట్స్ కి వెళ్లి పనిచేయాలని అనిపించేది. అలా వచ్చిన ఇంట్రస్ట్ తోనే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా లో చేశాను అంటూ తెలిపారు.
అయితే సినిమాలో నటించడం ఇష్టమే కానీ ఆ మేకప్ వాళ్ళు చెప్పిన బట్టలు వేసుకోవడం నావల్ల కాలేదు అందుకే మొదటి సినిమా ఇష్టం లేకుండానే ఫినిష్ చేశాను. ఇక అడ్వాన్స్ ఇప్పించుకున్నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను తీసుకున్నాను అంటూ సుప్రియ పేర్కొన్నారు. ఇక తాను మళ్ళీ సినిమాల్లో నటించాలని ఇంట్రస్ట్ చూపుతోందని అందుకు అడవి శేష్ ప్రోత్సాహం కూడా కారణమని వందంతులు ఉన్నాయంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…